Big Stories

Joginapally Santosh Kumar: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై కేసు నమోదు..

Joginapally Santosh Kumar
Joginapally Santosh Kumar

Joginapally Santosh Kumar: బీఆర్ఎస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారా హిల్స్ రోడ్. నెం. 14లో భూకబ్జాకు యత్నించారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మాజీ ఎంపీ సంతోష్‌తో పాటు లింగారెడ్డి శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు.

- Advertisement -

129/54 సర్వే నెం. లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ కంపెనీ కొనుగోలు చేసింది. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నిస్తున్నారని చింతా మాధవ్ ఈ నెల 21న ఫిర్యాదు చేశారు. ఐపీసీ 400, 471, 447, 120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News