E-Paper
Advertisement

Moscow Attack behind on Telegram app:మాస్కో ఉగ్రదాడిపై కొత్త విషయాలు, టెలిగ్రామ్ యాప్‌తో..

Moscow Attack behind on Telegram app:మాస్కో ఉగ్రదాడిపై కొత్త విషయాలు, టెలిగ్రామ్ యాప్‌తో..
Advertisement

Moscow Attack behind on Telegram app: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నిందితులు కేవలం మెసేజింగ్ టెలిగ్రామ్ యాప్ నుంచి దాడుల తతంగాన్ని నడిపినట్లు అధికారులు గుర్తించారు. నిందితులను బ్రియాన్స్క్ ప్రాంతంలోని ఖట్సన్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది.

Advertisement

డబ్బులు, ఆయుధాలు ఇచ్చినవారెవరో తెలీదని నిందితులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను నేషనల్ ఛానెళ్లు ప్రసారం చేశాయి. అలాగే నిందితులు వాడిన కారును కూడా సొంత చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు రష్యా యాసలో మాట్లాడుతున్నాడు. వీరంతా తజికిస్థాన్‌కు చెందినవారని రష్యా నేతలు చెబుతున్నారు. నిందితుల్లో ఒకరు మాత్రం తాము కేవలం డబ్బుల కోసమే ఈ దారుణానికి పాల్పడ్డామని చెబుతున్నారు.

ఈ డీల్‌లో భాగంగా నిందితుల బ్యాంక్ ఖాతాలో సగం మనీ వేసినట్టు గుర్తించారు అధికారులు. అయితే డబ్బు, ఆయుధాలు సరఫరా చేసినవారు ఎవరో తెలీదని చెప్పుకొచ్చారు. కేవలం టెలిగ్రామ్ యాప్ నుంచే సంప్రదింపులు జరిగినట్టు తెలిపారు. ఘటన తర్వాత ఆయుధాలను రోడ్డు పక్కన పారేసినట్టు మరో నిందితుడు చెప్పుకొచ్చాడు.

Advertisement

ఈ ఘటనలో ఇప్పటివరకు 133 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఇదిలావుండగా ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటన చేసింది.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×