E-Paper
Advertisement

Betting Sites: ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం స్పెషల్ ఫోకస్.. 8000 వెబ్ సైట్స్ బ్లాక్

Betting Sites: ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం స్పెషల్ ఫోకస్.. 8000 వెబ్ సైట్స్ బ్లాక్
Advertisement

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల తలెత్తుతున్న సామాజిక, ఆర్థిక ముప్పులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. తాజాగా మరో 242 ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లను బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు విఘాతం కలిగించడంతో పాటు.. సామాన్యులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న ఇలాంటి వెబ్‌సైట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.

గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 8,000 కు పైగా వెబ్‌సైట్లను, మొబైల్ యాప్‌లను నిలిపివేసింది. వీటిలో ప్రధానంగా విదేశీ మూలాలు ఉన్న సంస్థలు, మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్లాట్‌ఫారమ్‌లే ఎక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఐపీఎల్ వంటి క్రికెట్ టోర్నమెంట్ల సమయంలో ఈ బెట్టింగ్ సైట్ల ఆగడాలు ఎక్కువగా ఉండటంతో.. నిఘా వర్గాలు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాయి.

Advertisement

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించిన నివేదికల ఆధారంగా.. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ వెబ్‌సైట్లను బ్లాక్ చేస్తున్నారు. డిజిటల్ ప్రకటనల ద్వారా యువతను ఆకర్షించి, వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలిస్తున్నారని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ చర్యల ద్వారా ఆన్‌లైన్ మోసాల నుండి పౌరులను రక్షించడంతో పాటు, అక్రమ ఆర్థిక లావాదేవీలను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజలు ఇటువంటి మోసపూరిత వెబ్‌సైట్లకు దూరంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

ALSO READ: BMC Election Results 2025-26: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి క్లీన్ స్వీప్: బిఎమ్‌సిలో బీజేపీ కూటమి జోరు!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×