E-Paper
Advertisement

BJP Telangana Election Committee : ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ

BJP Telangana Election Committee : ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ

BJP Telangana Election Committee : కేంద్ర బీజేపీ తెలంగాణ ఎన్నికల బీజేపీ కమిటీలను ప్రకటించింది. మొత్తం 14 కమిటీలు, వాటికి చైర్మన్లుగా రాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న నేతలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ పబ్లిక్ మీటింగ్స్ కమిటీ ఛైర్మన్‌గా బండి సంజయ్, ఆందోళనల కమిటీ ఛైర్‌ పర్సన్‌గా విజయశాంతి, ఛార్జ్‌షీట్‌ కమిటీ ఛైర్మన్‌గా మురళీధర్‌రావు, సోషల్‌మీడియా కమిటీ ఛైర్మన్‌గా అర్వింద్, ఈసీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా వివేక్‌ వెంకటస్వామిలను నియమించింది.

అలాగే.. బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా మహేష్‌రెడ్డి, కో-ఆర్డినేషన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డి, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మీడియా కమిటీ ఛైర్మన్‌గా రఘునందన్‌రావు, SC సెగ్మెంట్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఛైర్మన్‌గా జితేందర్‌రెడ్డి, ST సెగ్మెంట్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఛైర్మన్‌గా గరికపాటి మోహన్‌రావులు నియమితులయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర పదాధికారులు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సమావేశమైంది. కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. జిల్లా, ఎన్నికల నిర్వహణ కమిటీల ఏర్పాటుపై, శుక్రవారం జరిగే స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×