Cotton Prices: స్వేచ్ఛ బ్యూరో: వ్యవసాయ జిల్లాగా పేరు గాంచిన జోగులాంబ గద్వాల జిల్లాలో అన్నదాతలు పత్తి, వరి, కంది, పొగాకు,మొక్కజొన్న , ఇతర పంటలను సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ సాగు చేసే పంట పత్తి పంట. విత్తనాలు అధిక ధరలు ఉండడంతో రైతులకు సాగు ఖర్చులు తడిపి బారెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిసాగు చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ కు తీపి కబురు చెప్పింది. ప్రతి సంవత్సరం చదువుతున్న సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఊరటనిస్తూ పత్తి విత్తనాలు ప్రస్తుతానికి పెంచకూడదని నిర్ణయం తీసుకుంది.
అధిక సాగు ఖర్చులతో పెట్టుబడులు ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులకు 2026-27 సంవత్సరానికి పాతదరనే కొనసాగిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో పత్తిసాగుపై ఆసక్తి ఉన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిజీ టు 475 గ్రాములు ప్యాకెట్ ధర 850 నుంచి 900 వరకు ఉంటుంది. 2026 లో పాత ధరలను కొనసాగించాలని కేంద్రం సూచించింది. పెంచకుండా స్థిరంగా ఉంచారు.
Also Read: హోండా అడ్వెంచర్ స్కూటర్ వచ్చేస్తోంది.. హీరో జూమ్, ఏరాక్స్కు చుక్కలే!
జోగులాంబ గద్వాల జిల్లాలో 4.68 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. పత్తి పంట సాగుకు ఎకరాకి రెండు ప్యాకెట్ల చొప్పున అవసరమవుతాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఖరీఫ్ లో పత్తిసాగు విస్తీర్ణం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గత ఖరీఫ్ లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాగా మద్దతు ధర సైతం లభించింది. దీంతో ప్రస్తుత సీజన్ లో పత్తి, మిరప సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.
అనధికారిక డీలర్ల వద్ద పత్తి విత్తనాలను కొనుగోలు చేయవద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి రిసిప్ట్ పొందాలన్నారు. మోసపూరిత ప్రకటన నుండి హెచ్ టి విత్తనాలు కొనుగోలు చేయడం చట్టరీత్య నేరమన్నారు. ప్రతి పంటను సాగు చేసే రైతులకు పత్తి మద్దతు ధర క్వింటాకు కనీస మద్దతు ధర పెంచింది దీని ప్రకారం మద్యస్థ పత్తికి 8,267, క్వాలిటీ పత్తికి 8,667 వరకు మద్దతు ధర అందుబాటులో ఉండనుంది.
Alao Read: బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి కొబ్బరి నీళ్లు తాగే సరైన సమయం ఇదే!