E-Paper
Advertisement

Telangana Cabinet: ఆ మంత్రులకు బిగ్ షాక్..! కేబినెట్‌లోకి విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి..?

Telangana Cabinet: ఆ మంత్రులకు బిగ్ షాక్..! కేబినెట్‌లోకి విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి..?
Advertisement

Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. మరో వారం పది రోజుల్లో ఈ మార్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం, రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ సమీకరణలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు

Advertisement

ఈ పునర్వ్యవస్థీకరణలో నలుగురు లేదా ఐదుగురు మంత్రులను తప్పించే అవకాశం ఉంది. కొన్ని కీలకమైన పేర్ల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్ గౌడ్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. పొన్నంకు కీలకమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జాతీయ స్థాయిలో అవకాశం కల్పించవచ్చని టాక్. మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మంత్రిగా విజయశాంతి..?

Advertisement

మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఏఐసీసీలోకి తీసుకుని ఆయన స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే కేబినెట్ లోకి కొత్తగా మల్ రెడ్డి రంగారెడ్డిని తీసుకునే అవకాశం ఉంది. లేదామంత్రి కొండా సురేఖ స్థానంలో మాజీ మంత్రి ఉత్తమ్ పద్మావతికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. లేదా ఇదే స్థానంలో విజయశాంతిని తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు మరో ప్రచారం సాగుతోంది.

కొత్త వారికి కీలక పదవులు

పార్టీ, ప్రభుత్వంలో పలువురు కీలక నాయకులకు కొత్త బాధ్యతలు అప్పగించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబుకు కీలకమైన పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఆయనకు హోం మంత్రిగానూ అదనపు బాధ్యతలు ఇచ్చే ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణల్లో భాగంగా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మరొకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.

కొత్త మంత్రుల నియామకంతో పాటు, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ పనితీరును మరింత దూకుడుగా, సమర్థవంతంగా మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. కొన్ని కీలక శాఖలను అనుభవం గల లేదా కొత్తగా తీసుకునే మంత్రులకు అప్పగించడం ద్వారా పరిపాలనలో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పునర్వ్యవస్థీకరణ ప్రధానంగా రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా మార్చేందుకు, అన్ని వర్గాలకు సరైన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ మార్పులు కీలకంగా మారనున్నాయని పార్టీలో అంతర్గత చర్చ సాగుతోంది.

ఈ మార్పులు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెర లేపనున్నాయి. పార్టీలో ఉత్సాహం నింపడం, అసంతృప్తులను తగ్గించడం, పాలనాపరమైన సామర్థ్యాన్ని పెంచడం ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ మార్పులపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తుది ఆమోదం వచ్చిన తర్వాతే పునర్వ్యవస్థీకరణపై స్పష్టత రానుంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, లీకవుతున్న పేర్లు చూస్తుంటే.. తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మొత్తం వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పనితీరును, పార్టీ బలాన్ని పెంచే దిశగా జరుగుతున్న వ్యూహాత్మక అడుగులుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పుల ద్వారా అటు పార్టీలోనూ.. ఇటు పరిపాలనలోనూ కొత్త జోష్ ను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ALSO READ: Karimnagar: సర్పంచ్ పదవి కోసం హడావిడి పెళ్లి.. కట్ చేస్తే చివరకు..

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×