CJP Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్లో వద్ద CJP నిరసన కార్యక్రమం ముగిసింది. యువత మరియు సీజేపీ పార్టీ నాయకులు శాంతి యుతంగా కేద్ర ప్రభుత్వం పై నిరసణ కార్యక్రమం తెలిపారు. CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే పిలుపు మేరకు నేడు జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసనలో మద్దతు దారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నీట్, CBSE పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకాతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే, మరియు మద్దతు దారులు అందరు కలిసి నేడు ఢిల్లీలోని జంతక్ మంతర్ వద్ద సీజీఐ పార్టీ మద్దతు దారులు అందరూ కలిసి శాంతియుత నిరసణ కార్యక్రామాన్ని నిర్వహించారు.
భారతదేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు దిగింది. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ OSM వ్యవస్థలో అవకతవకలతో ఈ ఆందోళనలని చేపట్టింది. సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపుమేరకు వేలాది మంది యువత నిరసన వేదిక దగ్గరకు తరలివచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also read: మేడ్చల్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి!
మేము మేకిన్ ఇండియా అడిగితే మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారంటూ నినాదాలు చేశారు. మెరుగైన భవిష్యత్ కోసం ఈ నిరసన ఓ ముందడుగు అని యువకులు నినాదాు చేశారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు అమెరికాలోని బోస్టన్ నుంచి ఢిల్లీకి వచ్చాడు అభిజీత్ దీప్కే అంబేద్కర్ జీవిత చరిత్రని చేతిలో పట్టుకొని కనిపించారు. ఢిల్లీలో సీజేపీ మద్దతుదారులు చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read: గుండ్లపోచంపల్లిలో మహా అద్భుతం.. సిద్దిపేట బాలుడికి దక్కిన పునర్జన్మ!