E-Paper
Advertisement

హైదరాబాద్‌లో కొవిడ్ కలకలం.. గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ లక్షణాలు!

హైదరాబాద్‌లో కొవిడ్ కలకలం.. గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ లక్షణాలు!
Advertisement

Corona Cases: దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు మళ్లీ నిశ్శబ్దంగా విజృంభిస్తుండటం తెలుగు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నలుగురు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమరావతి ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఏపీలో కొత్తగా మరో 7 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. గుంటూరు, తూర్పుగోదావరి, బాపట్ల జిల్లాల్లో ఈ కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

హైదరాబాద్ ఆస్పత్రుల్లో రోగుల క్యూ..
మరోవైపు తెలంగాణలోనూ పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. గడిచిన నెల రోజులుగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తీవ్రమైన జలుబు, ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు, తీవ్ర జ్వరంతో వస్తున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, వీరికి వైద్యులు కేవలం సాధారణ ఇన్ఫెక్షన్లకే చికిత్స అందిస్తున్నారు తప్ప కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం లేదు. పరీక్షలు చేయకపోవడం వల్లే అధికారిక రికార్డుల్లో తెలంగాణలో కరోనా కేసులు ‘సున్నా’గా కనిపిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తార్నాకకు చెందిన ఒక మహిళ తీవ్ర శ్వాసకోశ సమస్యలతో మరణించడం, గాంధీ ఆస్పత్రిలో ఒక కేస్ వెలుగు చూడటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

Advertisement

కొరతలో ఆస్పత్రులు.. నిమ్మకు నీరెత్తిన ఆరోగ్య శాఖ
ICMR నివేదికల ప్రకారం దేశంలో జూన్ నెల నుంచే కరోనా గ్రాఫ్ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. అయినా సరే, రాష్ట్రంలో వ్యాధుల వ్యాప్తిని పర్యవేక్షించాల్సిన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులకు టెస్టింగ్ కిట్లు, మాస్కులు, శానిటైజర్ల కొనుగోలు బంద్ చేయడంతో ప్రస్తుతం ఆస్పత్రుల్లో తీవ్ర కొరత వేధిస్తోంది. ఆరోగ్య శాఖ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేదా హెచ్చరికలు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో వైద్యులు కూడా కేవలం సాధారణ మందులతో సరిపెడుతున్నారు.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
వాతావరణంలో మార్పులు, కొవిడ్ కొత్త సబ్‌వేరియంట్ల ప్రభావం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా తీవ్రమైన దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Advertisement

Also Read: మందులు తీసుకుంటున్నా కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉందా? మీరు చేసే ఈ 6 తప్పులే కారణం

Related News

మా గొంతు నొక్కొచ్చు.. కానీ యువత ఆగ్రహాన్ని ఆపలేరు.. రాహుల్, ప్రియాంకల అరెస్ట్‌పై మండిపడ్డ సీఎం రేవంత్!

ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో రాత్రి నుంచి.. బంగాళాఖాతంలో అల్పపీడనం!

కాంగ్రెస్ నాయకులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్!

Ramchander Rao: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులకు బిగ్ షాక్..?

‘ఎల్ నినో’తో ఎండిపోతున్న తెలంగాణ.. కాంగ్రెస్ నిద్రమత్తులో ఉందా? సీఎంకు దాసోజు శ్రవణ్ లేఖ!

రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. ఏమన్నారంటే?

నా చావు కాలేజీకి చెప్పకండి.. సంతోషిస్తారు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టూడెంట్ సూసైడ్ నోట్!

Big Stories

Advertisement
×