CM Relief Fund: స్వేచ్ఛ, బ్యూరో : పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. వివరాల ప్రకారం తొర్రూరు మండలానికి చెందిన 44 మందికి రూ.16.94 లక్షలు, తొర్రూరు పట్టణానికి 9 మందికి రూ.3.26 లక్షలు మంజూరు చేశారు.
Also Read: Kawasaki Ninja 300 Offer: కవాసకీ నింజాపై క్రేజీ ఆఫర్.. 28 వేల తగ్గింపు, ఫ్రీ KYT హెల్మెట్!
దేవరుప్పుల మండలంలోని 44 మందికి రూ.17.30 లక్షలు, కొడకండ్ల మండలానికి చెందిన 34 మందికి రూ.9.60 లక్షలు అందజేశారు. పాలకుర్తి మండలానికి చెందిన 95 మందికి రూ.33.96 లక్షలు, రాయపర్తి మండలంలోని 66 మందికి రూ.25.70 లక్షలు, పెద్దవంగర మండలానికి చెందిన 31 మందికి రూ.9.74 లక్షలు మంజూరు చేశారు. మొత్తంగా 323 మందికి రూ.1,18,52,000 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి ఎంతో తోడ్పడుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: CPI Narayana: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలు కార్పొరేట్ల లాభాల కోసమే : సిపిఐ నేత నారాయణ