CM Revanth In Delhi: ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి బిజీగా ఉన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ముందు పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రక్షణశాఖ, రైల్వే, విమానయాన శాఖ మంత్రులతో ఆయన సమావేశమై ప్రాజెక్టుల గురించి చర్చించారు.
ఢిల్లీ టూర్లో బిజీగా సీఎం రేవంత్రెడ్డి
ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి బిజీగా ఉన్నారు. గురువారం ఉదయం నుంచి పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి చివరివారంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి రక్షణమంత్రికి వివరించారు.
1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభస్మం ఈ ప్రాంతంలో నిమజ్జనం చేసిన విషయాన్ని తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. బాపూ ఘాట్ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు తెలిపారు.
కేంద్రమంత్రులతో సీఎం భేటీ.. ప్రాజెక్టులు-నిధులపై చర్చ
ఆ తర్వాత కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి, కొత్తగా రైల్వే లైన్లు గురించి మంత్రికి వివరించారు. ఆ తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్.
తెలంగాణలో మామనూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధి పై ఈ సందర్భంగా చర్చించారు. వరంగల్ జిల్లా మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తి కావడంతో అవసరమైన పనులు చేపట్టాలని కోరారు సీఎం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు రెడీగా ఉందన్నారు. దీనికితోడు కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచలో భూమి ఉందని తెలిపారు.
ALSO READ: కేసీఆర్ మదిలో పొత్తు ఆలోచన?
దీనికి సంబంధించి OLS సర్వే, ఫీజుబులిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్ పోర్ట్ కు ప్రత్యమ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా కోరారు సీఎం రేవంత్రెడ్డి.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని వినతి
కొత్తగూడెం ఎయిర్పోర్ట్కు పాల్వంచలో స్థలం గుర్తించినందున OLS సర్వే, ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు… pic.twitter.com/ISPuSFHGhl
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2026