E-Paper
Advertisement

Cm Revanth Reddy: గురుకులాల్లో నాసిర‌కం భోజ‌నంపై సీఎం రేవంత్ సీరియ‌స్.. ఊచ‌లు లెక్క‌బెట్టిస్తానంటూ వార్నింగ్!

Cm Revanth Reddy: గురుకులాల్లో నాసిర‌కం భోజ‌నంపై సీఎం రేవంత్ సీరియ‌స్.. ఊచ‌లు లెక్క‌బెట్టిస్తానంటూ వార్నింగ్!
Advertisement

రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌లో నాసిరకం భోజ‌నం పెడితే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాసిరకం బియ్యం, కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేస్తే బాధ్యుల‌తో ఊచ‌లు లెక్క‌పెట్టిస్తామ‌ని హెచ్చ‌రించారు. క‌లుషిత ఆహారం స‌ర‌ఫ‌రా చేసినా క‌ఠిన చ‌ర్యలు త‌ప్ప‌వ‌ని చెప్పారు. ప్రభుత్వ గురుకులాల్లో నాసిరకం భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు పెంచామ‌ని చెప్పారు.

Also read: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న‌ అరాచకాలు

Advertisement

ప్రజాప్రతినిధులు ఏ సన్న బియ్యం తింటున్నారో అవే బియ్యంతోనే గురుకుల విద్యార్థులకు భోజనం పెట్టాలనేది త‌మ ప్రభుత్వ సంకల్పమ‌ని చెప్పారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని ఆదేశించారు. విద్యార్థినుల‌కు స‌కాలంలో కాస్మొటిక్ ఛార్జీల‌ను చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి అయినా, విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గ్రీన్‌ చానల్‌ ద్వారా సకాలంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. గురుకుల పాఠశాలలను తక్కువ అంచనా వేయొద్దని సీఎం స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం ఏ సన్న బియ్యం తింటున్నారో అవే బియ్యంతో గురుకుల విద్యార్థులకు భోజనం పెడ‌తామ‌ని తెలిపారు.

గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని సీఎం మండిప‌డ్డారు. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే వారికి భవిష్యత్‌ ప్రయోజనాల్లో ప్రాధాన్యత ఇవ్వబోమని రేవంత్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్ర‌భుత్వ గురుకులాల్లో త‌ర‌చూ ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీంతో విద్యార్థులు అనారోగ్యం భారిన ప‌డుతూ ఆస్ప‌త్రి పాల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు, విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించేందుకు ప్ర‌భుత్వం న‌డుం బిగిస్తోంది.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×