BigTV English

Cm Revanth Reddy: గురుకులాల్లో నాసిర‌కం భోజ‌నంపై సీఎం రేవంత్ సీరియ‌స్.. ఊచ‌లు లెక్క‌బెట్టిస్తానంటూ వార్నింగ్!

Cm Revanth Reddy: గురుకులాల్లో నాసిర‌కం భోజ‌నంపై సీఎం రేవంత్ సీరియ‌స్.. ఊచ‌లు లెక్క‌బెట్టిస్తానంటూ వార్నింగ్!

రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌లో నాసిరకం భోజ‌నం పెడితే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాసిరకం బియ్యం, కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేస్తే బాధ్యుల‌తో ఊచ‌లు లెక్క‌పెట్టిస్తామ‌ని హెచ్చ‌రించారు. క‌లుషిత ఆహారం స‌ర‌ఫ‌రా చేసినా క‌ఠిన చ‌ర్యలు త‌ప్ప‌వ‌ని చెప్పారు. ప్రభుత్వ గురుకులాల్లో నాసిరకం భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు పెంచామ‌ని చెప్పారు.


Also read: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న‌ అరాచకాలు

ప్రజాప్రతినిధులు ఏ సన్న బియ్యం తింటున్నారో అవే బియ్యంతోనే గురుకుల విద్యార్థులకు భోజనం పెట్టాలనేది త‌మ ప్రభుత్వ సంకల్పమ‌ని చెప్పారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని ఆదేశించారు. విద్యార్థినుల‌కు స‌కాలంలో కాస్మొటిక్ ఛార్జీల‌ను చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి అయినా, విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గ్రీన్‌ చానల్‌ ద్వారా సకాలంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. గురుకుల పాఠశాలలను తక్కువ అంచనా వేయొద్దని సీఎం స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం ఏ సన్న బియ్యం తింటున్నారో అవే బియ్యంతో గురుకుల విద్యార్థులకు భోజనం పెడ‌తామ‌ని తెలిపారు.


గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని సీఎం మండిప‌డ్డారు. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే వారికి భవిష్యత్‌ ప్రయోజనాల్లో ప్రాధాన్యత ఇవ్వబోమని రేవంత్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్ర‌భుత్వ గురుకులాల్లో త‌ర‌చూ ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీంతో విద్యార్థులు అనారోగ్యం భారిన ప‌డుతూ ఆస్ప‌త్రి పాల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు, విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించేందుకు ప్ర‌భుత్వం న‌డుం బిగిస్తోంది.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×