E-Paper
Advertisement

CM Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీని బొక్కలో వేయకుండా బీజేపీ ఎందుకు కాపాడుతోంది?: సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న!

CM Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీని బొక్కలో వేయకుండా బీజేపీ ఎందుకు కాపాడుతోంది?: సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న!

CM Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాల వైఖరిపై నిప్పులు చెరిగారు. “గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేశారు. ఎవరికైనా ఇల్లు వచ్చిందా? ఆయనకు మాత్రం ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ వచ్చింది, ఆయన కొడుక్కి, అల్లుడికి, బిడ్డకు ఫామ్ హౌస్‌లు వచ్చాయి. పేదల పట్ల ప్రేమ లేదు కాబట్టే గ్రామాల్లో ఇళ్లు కట్టలేదు” అని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి’ అని, చేసిన పాపాలు ఊరికే పోవని, ఆ ఊబిలోనే వాళ్లు కూరుకుపోతారని హెచ్చరించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తనను ‘రేవంత్ ఉద్దీన్’ అని పిలిచినా తనకు బాధ లేదని, తాను అందరి వాడినని పేర్కొన్నారు. అయితే, కిషన్ రెడ్డి ‘కల్వకుంట్ల కిషన్ రావు’గా మారి కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఈడీ కేసులతో వేధించిన బీజేపీ, లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కాపాడుతోందని నిలదీశారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా జర్నలిస్టులను, జడ్జీలను బ్లాక్ మెయిల్ చేసిన సన్నాసుల మీద చర్యలు ఎందుకు లేవని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ.. “గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వస్తాడా? లైట్ వేయాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా? ఓటు వేసేటప్పుడు పెళ్లి పెద్దని చూసి పిల్లని ఇస్తామా, పిల్లగాడిని చూసి ఇస్తామా?” అని చమత్కరించారు. మన గల్లీలో ఉండి పని చేసే గండ్ర సత్యనారాయణ లాంటి వారిని గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీలకు తమ ప్రభుత్వం రూ. 616 కోట్ల నిధులు ఇచ్చిందని, ఈ పనులన్నీ సజావుగా సాగాలంటే కౌన్సిలర్ తమ వాడై ఉండాలని స్పష్టం చేశారు.

అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ, 2027 గోదావరి పుష్కరాల కోసం బాసర నుండి భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం రూ. 3,000 నుండి రూ.  4,000 కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందని, ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, భూపాలపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Read Also: CM Revanth Reddy: ఆ వార్తల్లో వాస్తవం లేదు.. అపోహలు నమ్మొద్దు.. భూపాలపల్లి గడ్డపై రేవంత్ క్లారిటీ!

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×