E-Paper
Advertisement

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ, ఖర్గే తో కీలక భేటీ.!

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ, ఖర్గే తో కీలక భేటీ.!
Advertisement

CM Revanth Reddy: నేడు ఢిల్లీలో బిజిబిజిగా గడపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ బిల్లుకు జాతీయ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. BC బిల్లు గురించి ఇండియా కూటమి ఎంపీలకు వివరించనున్నారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

బీసీల హక్కులను చట్టబద్ధంగా సాధించేందుకు

Advertisement

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేను ఆధారంగా చేసుకొని.. బీసీల హక్కులను చట్టబద్ధంగా సాధించేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, సర్వే ఫలితాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న ధ్యేయంతో కేంద్ర నాయకత్వాన్ని కలవనున్నారు.

ఇండియా కూటమి ఎంపీలకు వివరాలు – బీసీ బిల్లుపై అవగాహన
ఈరోజు రేవంత్ రెడ్డి ఇండియా కూటమిలోని ఎంపీలను.. ప్రత్యేకంగా కలిసి బీసీ బిల్లుపై వీరి మద్దతును కోరనున్నారు.

Advertisement

కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
అంతేగాక, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ప్రత్యేకంగా.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం, తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే విధానం, తీరులు, ఫలితాలను చర్చించనున్నారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీ వర్గాల వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయని, అదే విధంగా దేశవ్యాప్తంగా దీనిని అనుసరించవచ్చని సూచించనున్నారు.

రాహుల్, ఖర్గే లకు నివేదిక సమర్పణ
ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లను కలిసి.. తెలంగాణ కులగణన సర్వే ఫలితాలను అధికారికంగా సమర్పించనున్నారు. బీసీల సాధికారతకు ఈ సర్వే ఎంత కీలకమైందో, దానిని ఎలా ఉపయోగించుకోవాలో వివరిస్తారు. బీసీలకు న్యాయం చేయాలంటే.. పార్లమెంటు స్థాయిలో చర్యలు అవసరమని సూచించనున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి – 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్
రేవంత్ రెడ్డి ముఖ్యంగా పార్లమెంట్‌లో.. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, ఆ బిల్లును భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

Also Read: మరో మైలురాయిని దాటేసిన తెలంగాణ ఆర్టీసీ.. ఏకంగా 200 కోట్ల మంది మహిళలు..?

బీసీ బిల్లు – దేశవ్యాప్తంగా చర్చకు దారి
తెలంగాణ సీఎం ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా బీసీల ప్రాతినిధ్యంపై.. చర్చకు దారితీయబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన గౌరవం లభించేందుకు ఈ కృషి కీలకమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×