CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీకి లభిస్తున్న ప్రజాభిమానమే ఈ ఫలితాలకు నిదర్శనమని, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నాయకులు ఐక్యంగా పనిచేయడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయని సీఎం పేర్కొన్నారు.
Also Read: Auto Ram Prasad: డైరెక్టర్ గా మారనున్న జబర్దస్త్ కమెడియన్.. బుల్లితెరకు గుడ్ బై చెప్పినట్టేనా?
స్థానిక నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త అభినందనీయుడని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ప్రాధాన్య అవసరాలు, చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. ఈ భేటీతో పాలకుర్తి అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపునిచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: Harish Rao: రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నాం.. ఇక గల్లా పట్టి నిలదీస్తాం: హరీష్ రావు