E-Paper
Advertisement

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోంది.. ‘గవర్నర్‌పేట టు గవర్నర్ హౌస్’ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోంది.. ‘గవర్నర్‌పేట టు గవర్నర్ హౌస్’ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy on National PoliticsCM Revanth Reddy on National Politics(Political news in telangana): దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్రపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గిపోతోందని సీఎం రేవంత్ రెడ్డి వాపోయారు. దీనికి కారణం పార్ట్ టైమ్ రాజకీయనాయకులేనని అభిప్రాయపడ్డారు. ఆదివారం తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డీజీపీ పీఎస్ రామ్మోహన్ రావు రచించిన గవర్నర్‌పేట టు గవర్నర్ హౌస్ అనే పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇదొక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుందని తెలిపారు.

ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజకీయాలలో తెలుగువారి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీలం సంజీవరెడ్డి, పీవీ, ఎన్టీఆర్ దేశ రాజకీయాలను శాసించారని.. ఇది తెలుగువారందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు. వారి తర్వాత సూదిని జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు దేశ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు.

కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఎవరిని కలవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు తెలుగువారికి సంభందించిన అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించే నేతలు కరువయ్యారని తెలిపారు.

Read More: బీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే.. ఆ ఎంపీ సీటు కోసమేనా?

దేశ రాజకీయాలలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పీవీ దేశ ప్రధానిగా నంద్యాలలో పోటీ చేస్తే ఎన్టీఆర్ పీవీ మీద అభ్యర్ధిని పెట్టలేదన్న సంగతిని గుర్తుచేశారు. తెలుగువారి కోసం రాష్ట్రాలుగా విడిపోయినా కలిసుందాం అని పేర్కొన్నారు.

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×