E-Paper
Advertisement

CM Revanthreddy: ఆ మూడింటిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanthreddy: ఆ మూడింటిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanthreddy: హైదరాబాద్ మహానగరంలో ఇకపై ఆక్రమణలు జరగడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ప్రతి చెరువు నాలాల ఆక్రమణలకు సంబంధించిన వివరాలు సేకరించాలని నివేదిక ఇవ్వాలన్నారు. ఇకపై ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలన్నారు.

హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నతస్థాయి సమావేశంలో నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలన్నారు. అభివృద్ధి విషయంలో పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదన్నారు. అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలన్నారు. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని అధికారులకు నిర్ధేశం చేశారు. చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాల్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటికీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలన్నారు.

ALSO READ: డిపోలోకి వచ్చి మరీ.. ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరకు ఎలా దొరికాడంటే..?

ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్‌పై రెడీ చేసి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలన్నారు.

ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టడంతోపాటు మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చేశారు.

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ ‌మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, హైదరాబాద్ మెట్రో రైలు‌, హైడ్రాపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×