BigTV English
Advertisement

kothagudem : మిగ్‌జాం తుఫాన్.. జలమయమైన ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్..

kothagudem : మిగ్‌జాం తుఫాన్.. జలమయమైన ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్..

kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా మిగ్‌జాం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆమె పర్యటించి అధికారుల నుండి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ప్రియాంక ఆలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టం వివరాలు అంచనా వేసి తనకు రిపోర్ట్ అందజేయాలని అధికారులను ఆదేశించారు.


అలానే దమ్మపేట మండలంలో భారీ వర్షం కారణంగా మండల కేంద్రంలోని పేరంటాల చెరువు కాలువ తెగి వరదనీరు పంట పొలాలపై నుంచి పారుతుండటంతో ఆ ప్రాంతాన్ని ప్రియాంక ఆలా సందర్శించారు. అలానే పట్వారి గూడెం గ్రామంలో దెబ్బతిన్న వరి,శనగ, మొక్కజొన్న, పంటను ఆమె పరిశీలించారు. అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి గ్రామంలో తుఫాన్ దాటికి నేలకొరిగిన ఇంటిని ఆమె పరిశీలించారు. తక్షణమే వారికి సహాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.


Related News

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Hyderabad: జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ హత్య కేసులో 24 గంటల్లోనే వీడిన మిస్టరీ!

Bandi Sanjay: బోరబండ రోడ్ షో రగడ.. పోలీసులు ఎంఐఎం తొత్తులా?, బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×