Kodanda Reddy: నకిలీ విత్తనాలను అరికట్టాలంటే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని మేలైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి (Kodanda Reddy) సూచించారు. రైతు కమిషన్ కార్యాలయంలో విత్తనోత్పత్తి క్షేత్రాలపై రైతు కమిషన్ సమీక్షా సమావేశం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలో 8 చోట్ల సీడ్ ఫార్మ్ ఉన్నాయని, 1629 ఎకరాల్లో వున్న సీడ్ ఫార్మ్ లో వివిధ రకాల విత్తనాలను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి చేస్తున్నట్లు అడిషనల్ డైరెక్టర్ నర్సింహారావు కమిషన్కు వివరించారు. వరి, పెసర, జనుము, కందులు విత్తనోత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రైతు మిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ విత్తనోత్పత్తిని పెంచాలని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
త్తనోత్పత్తి క్షేత్రాల భూములు అన్యాక్రాంతం కాకుండా హద్దులను ఏర్పాటు చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ చేయాలని సూచించారు. ఎక్కడైనా భూ సమస్యలు ఉన్న చోట ఆ విషయాలను అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రటరీ గోపాల్ , వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ సుచరిత, డీడీఏ నాగమల్లీశ్వరీ, ఏడీఏ ఉషారాణి, సీడ్ ఫార్మ్ కు చెందిన అగ్రికల్చర్ అధికారులు వైద్యనాధ్, సక్రియ నాయక్, ఇంద్రసేన్, అనిల్ కుమార్, వాసు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Srinivas Goud: కాంగ్రెస్కు అనుకూలంగా పోలీసుల వ్యవహారం.. బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఫైర్!