E-Paper
Advertisement

Congress: జూపల్లి ముందుకి.. పొంగులేటి వెనక్కి.. ‘కేసీఆర్‌ హఠావో- తెలంగాణ బచావో’

Congress: జూపల్లి ముందుకి.. పొంగులేటి వెనక్కి.. ‘కేసీఆర్‌ హఠావో- తెలంగాణ బచావో’
Advertisement
TCong rahul gandhi

Congress News Telangana(Latest breaking news in telugu): కాంగ్రెస్ పార్టీకి బిగ్ డే. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సందడే సందడి. అది హస్తిననా.. తెలంగాణా? అన్నట్టు నెలకొంది కోలాహలం. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 35 మంది ప్రముఖ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిశారు. పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు రాహుల్, ఖర్గేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జూలై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు రాహుల్‌ను ఆహ్వానించారు.
అయితే, పార్టీ రిలీజ్ చేసిన చేరికల జాబితాలో జూపల్లి కృష్ణారావు పేరు అందరికంటే ముందు ఉండగా.. పొంగులేటి పేరు మాత్రం ఏకంగా 15వ నెంబర్‌లో చేర్చడాన్ని మీడియా హైలైట్ చేస్తోంది.

కాంగ్రెస్‌లో ‘ఘర్ వాపసీ’ జరుగుతోందని అన్నారు రాహుల్‌గాంధీ. గతంలో పార్టీని వీడిన వారు తిరిగి సొంతగూటికి చేరుతుండటం ఆనందంగా ఉందన్నారు. ‘కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంలో ముందుకెళ్లాలని నేతలకు రాహుల్‌గాంధీ సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. పార్టీ నేతలంతా సమష్ఠిగా పోరాడాలని పిలుపు ఇచ్చారు రాహుల్‌.

Advertisement

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఢిల్లీలో ఈ భారీ కార్యక్రమం జరిగింది. రేవంత్‌తో పాటు.. కేసీ వేణుగోపాల్‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ, అరికెల నర్సారెడ్డి, గురునాథరెడ్డి తదితరులు ఉన్నారు.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×