E-Paper
Advertisement

Jeevan Reddy:” కాళేశ్వరం, మిషన్‌ భగీరథపై న్యాయ విచారణ జరిపించాలి”

Jeevan Reddy:” కాళేశ్వరం, మిషన్‌ భగీరథపై న్యాయ విచారణ జరిపించాలి”

Jeevan Reddy: కాళేశ్వరం, మిషన్‌ భగీరథపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలిలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడి గడ్డ బ్యారేజీ కుంగుబాటుపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించాలన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం సాగునీటి కోసం వినియోగించకుండా పర్యాటకంగా వాడుకోవడం విడ్డూరమని ఆరోపించారు.

‘‘మిషన్‌ భగీరథ పథకం కమీషన్ల కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వసతులు ఉన్నా, రామగుండం కాదని యాదాద్రిలో పవర్‌ ప్లాంట్‌ పెట్టారన్నారు. విద్యుత్‌ విభాగంలో ₹80,000ల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారీ భారం మోపారన్నారు.

ఐటీఐఆర్‌ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం అంటోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలన్నారు. కేంద్రం వివక్ష వల్ల జాతీయ హోదా సాధించలేకపోయాం. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకోవాలన్నారు. కృష్ణా జలాలు కాపాడుకోవడంలో గత ప్రభుత్వం తరహాలో ఉదాసీనత వ్యవహరించరాదన్నారు. సాగు నీరు హక్కులు కాపాడటంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు.

Tags

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×