Swetcha Effect: స్వేచ్ఛ బ్యూరో: భువనగిరి పట్టణంలోని ఇండియా మిషన్ స్కూల్ ఫీజుల పేరిట విద్యార్థులను తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసిన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన స్వేచ్ఛ. మిషనరీ స్కూల్ లో అనేక అక్రమాలు, ఆర్థిక లావాదేవీలపై వరుస కథనాలకు స్పందించిన ఇండియా మిషన్ కమిటీ (IMI) కరస్పాండెంట్ జూడ ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ కరెస్పాండెంట్ జూడ అనేక అక్రమాలకు పాల్పడ్డాడని భువనగిరి పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదయ్యాయి.
Also Read: CM Revanth Reddy: పండుగ వేల రైతు భరోసా నిధుల పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..!
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఇండియా మిషన్ స్కూల్ లో నిధులను స్వంత ప్రయోజనాల కొరకు వాడుకోవడమే కాకుండా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడడంతో మిషన్ విధివిధానాలకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుండడంతో జూడాను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మిషనరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్కొన్నారు. నిజాలను నేర్పయంగా బయటికి తీసుకొస్తూ వార్తలు రాసిన రిపోర్టర్ పైన వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు చేస్తుండడాన్ని మిషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు తీవ్రంగా ఖండిస్తూ జూడ ఇకముందు ఇలాంటి వ్యక్తిగత దూషణలో పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
Also Read: Aswaraopeta: కార్పొరేట్ ఫ్యాక్టరీల్లో కార్మికుల పరిస్థతి దారుణం.. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..!