E-Paper
Advertisement

Fake Notes: కారేపల్లిలో దొంగనోట్ల కలకలం.. రూ.50 కోట్లకు పైగా అక్రమ వ్యాపారం

Fake Notes: కారేపల్లిలో దొంగనోట్ల కలకలం.. రూ.50 కోట్లకు పైగా అక్రమ వ్యాపారం

Fake Notes: స్వేఛ్చ బ్యూరో: కారేపల్లిలో దొంగనోట్ల చలామణి వ్యవహారం వ్యాపార వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. మూడు రోజుల క్రితం బ్యాంక్ అధికారులు గుర్తించిన దొంగ నోటు వ్యవహారం బయటికి రావడం అదికూడా ఓ ప్రైవేట్ చిట్టీ వ్యాపారి వద్ద నుంచి చలామణి అయిందనే ఆరోపణ పై విస్తృతంగా చర్చ జరగడంతో ఇంటిలిజెన్సీతో పాటు కారేపల్లి పోలీసులు కూడా వివరాలు తెలుసుకునే పనులు చేపట్టారు. కారేపల్లి బీసీ కాలనీకి చెందిన ఓ చిట్టి వ్యాపారిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించినట్లు కూడా సమాచారం. కారేపల్లి కేంద్రంగా మండల వ్యాప్తంగా అనుమతులు లేకుండా చిట్టీలు, గిరి గిరి, ఫైనాన్స్, గ్రూపు లోన్ల పేరుతో నెలసరి 50 కోట్ల రూపాయలకు పైబడి అక్రమ దందా నడుస్తోంది. ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో కొందరు దొంగ నోట్ల చలామణి కూడా సులువుగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

చిట్టీలు నడిపే వ్యక్తి..

స్వయంగా బ్యాంక్ అధికారులే గుర్తించిన ఫేక్ నోట్ చిట్టీలు నడిపే వ్యక్తి నుంచే రావడంతో కారేపల్లిలో నడుస్తున్న అక్రమ దందాపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. భారీ స్థాయిలో అక్రమ దందా నడుస్తున్నప్పటికీ నిఘా వర్గాలు వీటిపై దృష్టి సారించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. అనుమతులు లేని అక్రమ వ్యాపారాలు బహిరంగంగానే జరుగుతున్నా నియంత్రించాల్సిన యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దొంగ నోట్లు కలకలంతో వ్యాపార వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. దుకాణాలకు వచ్చిన ప్రతి నోటును క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టుబడ్డ నోటు కూడా బయట గుర్తించలేని విధంగా ఉండడంతో వ్యాపార వర్గాల ఆందోళన చెందుతున్నాయి.

Also Read: Arjun Sarja: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్ మెన్’ రిజెక్ట్ చేశాను.. కొడతారేమోనని సినిమా చేశా.

నిఘా నిద్రపోతుంటే.. దగా దండుకుంటుంది

అక్రమ వ్యవహారాలను నియంత్రించాల్సిన నిఘా విభాగాలు నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్రమ వ్యాపారాలకు తెరలేపిన దగా కోరులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మండల వ్యాప్తంగా అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

ఆంధ్రా ముఠాల ఫైనాన్స్ ఆగడాలు..

మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పేద మధ్యతరగతి గిరిజనుల అవసరాలను ఆసరాగా తీసుకొని ఆంధ్ర నుంచి వచ్చిన ఫైనాన్స్ ముఠాల అక్రమ వ్యాపారం అడ్డు అదుపు లేకుండా సాగుతుంది. వారాల వసూళ్లతో అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఈ ముఠాలు గ్రామాల్లో ఫైనాన్సు చేస్తున్నాయి.

అక్రమ దందాపై పోలీసులు దృష్టి సారించాలి..

కారేపల్లి మండలంలో అక్రమంగా నడుస్తున్న దందాల పై పోలీస్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కొత్తగా వచ్చిన డైనమిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎన్నో క్లిష్టమైన కేసులను చేదించి పోలీస్ శాఖలో మంచి పేరు కూడా సాధించారు. అదే స్ఫూర్తితో ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ దందాపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే అనేక అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని పలువురు కోరుతున్నారు.

Also Read: The Protector on OTT : షైన్ టామ్ చాకో థ్రిల్లర్‌ స్ట్రీమింగ్ షురూ… ఈ ఓటీటీలోనే అందుబాటులో

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×