E-Paper

Paddy Procurement: కాంగ్రెస్ సర్కార్‌కు మిత్రపక్షం షాక్.. ధాన్యం కొనుగోళ్ల నిర్ణయంపై సిపిఐ తీవ్ర ఆగ్రహం!

Paddy Procurement: కాంగ్రెస్ సర్కార్‌కు మిత్రపక్షం షాక్.. ధాన్యం కొనుగోళ్ల నిర్ణయంపై సిపిఐ తీవ్ర ఆగ్రహం!
Advertisement

Paddy Procurement: స్వేచ్చ బ్యూరో: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధి విధానాలు, కోటాల మేరకే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటించడం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. మంత్రుల ప్రత్యేక సమావేశంలో తీసుకున్న నిర్ణయం రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసేదిగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏయే పంటలకు మద్దతు ధర ప్రకటించి, ఎంత మేరకు కొనుగోలు చేస్తుందో అదే పరిమితిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా..

కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే పంటలపై ఆంక్షలు విధించే వివక్షతకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలను కలుపుకొని పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా ఎదిగిందని, రైతులు అనేక కష్టనష్టాలను భరించి పంటలను పండిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి, తెలంగాణలో పండిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలకు పరిమితమవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను గుర్తు చేసిన నెల్లికంటి సత్యం, ఇప్పుడు కేంద్రం మద్దతు ధర, కేంద్రం కోటాల పేరుతో కొనుగోళ్లను పరిమితం చేయడం సరైన విధానం కాదన్నారు.

Advertisement

Also read: మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మళ్లీ ఆ హీరోతోనేనా?

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ..

రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతుల ఉత్పత్తులకు పూర్తి రక్షణ కల్పించకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. రాష్ట్ర క్యాబినెట్ ధాన్యం కొనుగోలు తీర్మానాన్ని వెంటనే పునఃసమీక్షించి, రైతు ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలంటే కేంద్రం నిర్ణయించిన పరిమితులకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులు పండించిన ప్రతి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిందేనని నెల్లికంటి సత్యం స్పష్టం చేశారు.

Advertisement

Also read: జొమాటో, స్విగ్గీ వాడుతున్నారా? ఈ బిల్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం!

Related News

హీరో విజయ్ దేవరకొండ, వెంకటేశ్‌కు లీగల్ నోటీసులు.. TG20 టోర్నీ ప్రమోషన్లపై టీసీఏ సీరియస్ హెచ్చరిక!

హైదరాబాద్‌లో ఇళ్లు కట్టేవాళ్లకు బిగ్ షాక్.. జీవో 626 జారీ రూల్స్ బ్రేక్ చేస్తే సర్టిఫికేట్ రద్దు!

Pedestrian Rights: ఫుట్​ పాత్​ పై నడవటం ప్రాథమిక హక్కు!

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. లేబర్ కార్డుల దందాపై కదిలిన యంత్రాంగం!

ఇష్టపడి చదవండి.. దేశానికే ఆదర్శం కాండి.. విద్యార్థులకు సీఎం రేవంత్ పిలుపు!

South Telangana: ఆ నాలుగు జిల్లాలపై గులాబీ దళం నయా స్కెచ్.. పట్టు కోసం కేటీఆర్ వేసిన స్కెచ్ ఇదే..?

తెలంగాణలో జనసేన దూకుడు.. మణికొండలో పార్టీ ఆఫీసు.. ప్రారంభించిన పవన్

Big Stories

×