E-Paper
Advertisement

Crime: స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన ప్రేమ.. ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య

Crime: స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన ప్రేమ.. ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య
Advertisement

Crime: ప్రేమ.. ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఒకరంటే ఒకరికి పడకుండా చేసింది. బద్దశత్రువులను చేసింది. చివరికి ప్రాణాలు తీసుకునే వరకు తీసుకొచ్చింది. తాను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ తన స్నేహితుడికి దక్కుతుందోనన్న అనుమానంతో ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.

నవీన్, హరి అనే ఇద్దరు స్నేహితులు హైదరాబాద్ నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అయితే వారిద్దరూ ఒకే అమ్మాయిపైన మనసు పారేసుకున్నారు. ఇద్దరూ ఆమె కోసం ప్రాణాలిచ్చే వరకు వెళ్లారు. ఈక్రమంలో వారిద్దరి మధ్యలో కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. అమ్మాయి నాదంటే.. నాదంటూ పలుమార్లు కాలేజీలో గొడవ కూడా పడ్డారు.

Advertisement

ఈక్రమంలో నవీన్‌ను ఎలాగైనా తప్పించాలని హరి అనుకున్నాడు. ఓ పథకం పన్ని.. ఈ నెల 17న పార్టీ చేసుకుందామని నవీన్‌ను తన స్నేహితుడి రూమ్‌కి పిలిచాడు. ఈక్రమంలో మరోసారి గొడవ చోటుచేసుకుంది. దీంతో నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అయితే శంకరయ్య హరితో మాట్లాడడంతో గొడవ సద్ధమణిగింది.

ఆ తర్వాత నాలుగు రోజులు గడిచిపోయింది. నవీన్ కాలేజీ వెళ్లలేదు.. ఇంటికి కూడా వెళ్లలేదు. కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు.

Advertisement

ఇంతలోనే షాక్.. హరి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నవీన్‌ను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి ఎక్కడ నవీన్‌కు దక్కుతుందనే కోపంతో కొట్టి చంపానని పోలీసులకు వివరించాడు. పార్టీ అయిపోయాక విచక్షణారహితంగా కొట్టి మృతదేహాన్ని హైదరాబాద్-విజయవాడ హైవే పక్కన పడేశానని తెలిపాడు. దీంతో పోలీసులు మృతదేహం కోసం గాలిస్తున్నారు. విషయం తెలిసి నవీన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×