Case Register on KTR(Political news today telangana): మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కేటీఆర్పై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి భారీ ఎత్తున నగదు పంపారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్లోని బంజరాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు బుక్కయ్యింది.
కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆయన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆయన ప్రస్తావించారు. ఇదే వ్యవహారం పై హనుమకొండ పోలీసుస్టేషన్లోనూ కేటీఆర్పై కేసు బుక్కయ్యింది. ఆ కేసును హనుమకొండ పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కు బదిలీ చేశారు.