Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ చైర్మన్ గా డాక్టర్ ఏ వి ఎల్ నర్సింగరావును కాంగ్రెస్ స్టేట్ డాక్టర్ సెల్ చైర్మన్ రాజీవ్ నాయక్ నియమించి నియామక ఉత్తర్వులు అందించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా గద్వాల జిల్లాకు కావలసిన డాక్టర్ల నియామకము, ప్రత్యేక వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
Also Read: Liquor case: లిక్కర్ కేసులో వేగవంతమైన విచారణ.. సిట్ కస్టడీలోకి ముప్పిడి అవినాష్ రెడ్డి
జిల్లాలో ప్రజల ఆరోగ్య సంరక్షణనే లక్ష్యంగా జోగులాంబ గద్వాల జిల్లా డాక్టర్ సెల్ మెడికల్ అండ్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. తనపై నమ్మకం ఉంచి గద్వాల జిల్లా డాక్టర్స్ సెల్ కు అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారికి, కాంగ్రెస్ స్టేట్ డాక్టర్స్ సెల్ చైర్మన్ రాజీవ్ నాయక్ కు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు రాజీవ్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ మెడికల్ అండ్ హెల్త్ విభాగపు నుండి మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
Also Read:Kamran Akmal: ఆసియా కప్ లాగానే బంగ్లాదేశ్ నుంచి ట్రోఫీ దొంగతనం చేయ్..నఖ్వీ ఇజ్జత్ తీసిన అక్మల్