E-Paper
Advertisement

Drugs : హైదరాబాద్‌లో స్పెషల్ రైడ్స్.. అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్..

Drugs : హైదరాబాద్‌లో స్పెషల్ రైడ్స్.. అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్..
Advertisement

Drugs : సీఎం రేవంత్ సర్కారు.. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తున్న క్రమంలో పోలీసులు కూడా మరింత స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ తో ఇద్దరు అంతర్ రాష్ట్ర డ్రగ్స్ సరఫరా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 56 లక్షల రూపాయల విలువైన 3.5 కేజీల ఓపియంని పట్టుకున్నారు. అలానే 45 గ్రాముల పొప్పిస్ట్రా పౌడర్.. 2 లక్షల 80 వేల రూపాయల నగదు.. ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

కాగా నూతన సంవత్సర వేడుకలని టార్గెట్ చేస్తూ.. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి.. ఒపియం, పొప్పీ స్ట్రా డ్రగ్స్ ను అక్రమంగా తరలించినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో రాజస్థాన్ కి చెందిన శశిపాల్ బిష్ణోయ్, మదన్ లాల్ బిష్ణోయ్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ జైల్ కి వెళ్లొచ్చాడని అన్నారు.

Advertisement

వీరి అరెస్టుతో.. డ్రగ్స్ తో ఈవెంట్ చేసే వారికి బ్రేక్ వేసినట్లు అయ్యిందని పోలీసులు తెలిపారు. నిందితులు.. వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కి అమ్మడానికి చిన్న పాకెట్స్ గా తయారు చేశారని తేల్చారు. న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో పెట్టుకొని పబ్స్, బార్ లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీపీ సుధీర్ బాబు చెప్పారు.

Tags

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×