E-Paper
Advertisement

Earth quakes in Telangana: తెలంగాణలో పలుచోట్ల భూ ప్రకంపనలు.. భయాందోళనలో నగరవాసులు

Earth quakes in Telangana: తెలంగాణలో పలుచోట్ల భూ ప్రకంపనలు.. భయాందోళనలో నగరవాసులు
Advertisement

Earth quakes in Telangana: తెలంగాణలో పలుచోట్లు భూప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భూమి కంపించింది. సడన్‌గా భూమి కంపించడంతో ఆ ప్రాంత ప్రజలు హడలిపోయి భయంతో బయటకు పరుగులు తీశారు.

బుధవారం ఉదయం 7:26 నిమిషాలకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ సిటీ పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది.

Advertisement

రంగారెడ్డి, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి. దాదాపు మూడు నుంచి ఐదు సెకన్లపాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం, గూడూరు మండలాల్లో 10 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు.

రిక్టర్ స్కేలుపై ములుగులో 5.3 , మేడారం వద్ద 4 పైగానే ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. పెద్దపల్లి, గోదావరిఖనిలోని సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.

Advertisement

ALSO READ:  బిడ్డా.. లైన్ క్లియర్, కవితకు కేసీఆర్ సంకేతాలు!

భూ ప్రకంపనల ధాటికి ఆయా నగరాల వాసులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికి ప్రకంపనలు తగ్గడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో ఈ స్థాయిలో ఎప్పుడూ రాలేదని అంటున్నారు.

ప్రకంపనల ప్రభావం కొత్తగూడెం మైనింగ్‌పై ఏమైనా ప్రభావం చూపిందా అనేది ఇంకా తెలియాల్సివుంది. ఓవరాల్‌గా పరిశీలిస్తే తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అటు ఏపీలోని విజయవాడ సిటీ, జగ్గయ్యపేట సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టు వార్తలు వస్తున్నాయి.

అంతకుముందు అంటే నవంబర్ 30న అసొంలో వచ్చిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 2.9 గా నమోదు అయ్యింది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్‌లో 5.8గా నమోదైన విషయం తెల్సిందే.

 

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×