E-Paper
Advertisement

Rangareddy News: రంగారెడ్డి జిల్లాలో సర్టిఫికెట్ల అమ్మకాలు.. 50 వేలకు పదో తరగతి, 75 వేలకు ఇంటర్

Rangareddy News: రంగారెడ్డి జిల్లాలో సర్టిఫికెట్ల అమ్మకాలు..  50 వేలకు పదో తరగతి,  75 వేలకు ఇంటర్

Rangareddy News: రండి బాబు.. రండి.. యువతీ యువకులకు సువర్ణ అవకాశం. మీకు పదో తరగతి మొదలు బీటెక్ వరకు సర్టిఫికెట్లు కావాలా? చదవాల్సిన అవసరం లేదు. కనీసం పరీక్షలు కూడా రాయాల్సినవరం లేదు. డబ్బులిస్తే చాలు సర్టిఫికెట్లు మీ సొంతం. ఇదీ రంగారెడ్డి జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు అమ్మకాలు. ఈ  రాకెట్‌ను గుట్టురట్టు చేశారు పోలీసులు. మొత్తం ఐదుగుర్ని అరెస్టు చేశారు.

జోరుగా నకిలీ సర్టిఫికెట్ల అమ్మకాలు

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టుని రట్టు చేశారు సైబరాబాద్ SOT పోలీసులు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆపై బీటెక్ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న గ్యాంగ్‌ని అరెస్ట్ చేసింది. పలు యూనివర్శిటీల పేర్లతో తయారు చేసిన ఫేక్ సర్టిఫికెట్ల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ లకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు, మెమోలు తయారు చేస్తున్న గ్యాంగ్‌ని పక్కాగా స్కెచ్ వేసి అరెస్టు చేసింది. ఈ రాకెట్‌కి మూల సూత్రధారి మీర్జా అక్తర్ అలీ బేగంని గుర్తించారు. తయారీ, ప్రింటింగ్, అమ్మకాలు సాగించడంలో కీలక నిందితుడు. ప్రజలకు- నకిలీ సర్టిఫికెట్లు గ్యాంగ్‌‌కి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు మహమ్మద్ అహ్మద్.

50 వేలకు పదో తరగతి.. 75 వేలకు ఇంటర్ సర్టిఫికెట్లు

వీరితోపాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేయడానికి వచ్చినవారు అందులో ఉన్నారు. వారిలో వెంటకసాయి, రోహిత్, ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. వారి ఉద్యోగం రీత్యా నకిలీ సర్టిఫికెట్లు తీసుకోవడానికి వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఈ గ్యాంగ్ కేవలం తెలంగాణలోని యూనివర్సిటీల నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల యూనివర్సిటీలకు సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

ఎంక్వైరీ చేయరన్న కారణంతో మిగతా రాష్ట్రాల యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటివరకు ఎంతమందికి ఈ సర్టిఫికెట్లు విక్రయించారు? వాటిని కొనుగోలు చేసినవారు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు? ఏయే కంపెనీల్లో చేస్తున్నారు? పాస్‌పోర్టు లేదా వీసాల కోసం అప్లై చేశారా? వీటికి ఎక్కడెక్కడ ఉపయోగించుకున్నారు? అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.

ALSO READ: రైతుపై దాడి కేసులో అధికారి సస్పెండ్.. బిగ్ టీవీ ఎఫెక్ట్

నకిలీ సర్టిఫికెట్లను గుర్తించేందుకు కేంద్రం డిజిలాకర్‌ వ్యవస్థ‌ని తీసుకొచ్చింది. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో  సులభతరంగా వెరిఫికేషన్‌ చేయవచ్చు. సర్టిఫికెట్లకు కోడ్ తరహాలో వ్యవస్థని తీసుకొచ్చింది. ఇక మెమోలు అయితే డిజిలాటర్ నుంచి తీసుకునే సదుపాయం తీసుకొచ్చింది. దీనివల్ల ఏవి నకిలీ సర్టిఫికెట్లు.. ఏవి ఒరిజినల్ అనేది సులభంగా గుర్తించవచ్చు.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×