BigTV English
Advertisement

Train Accident: గౌడవెల్లిలో ట్రైన్ ఢీకొని.. తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి

Train Accident: గౌడవెల్లిలో ట్రైన్ ఢీకొని.. తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి

Hyderabad: తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌‌లోని మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మరణించారు. రాఘవేందర్ నగర్ కాలనీకి చెందిన కృష్ణ కుటుంబంగా వీరిని గుర్తించారు. కృష్ణ లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు.


కృష్ణ లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ రోజు ఆయన తన ఇద్దరు కుమార్తెలు వర్షిత, వరిణిని కూడా వెంట తీసుకెళ్లారు. వారిని ట్రాక్ పై కూర్చోబెట్టి పని చేసుకుంటున్నారు. వారిద్దరూ ట్రాక్ పైనే ఆడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఓ ట్రైన్ అదే ట్రాక్ పై రావడాన్ని కృష్ణ గుర్తించారు. వెంటనే తన కుమార్తెల వద్దకు వెళ్లారు. వారిని కాపాడబోతుండగా.. ప్రమాదం జరిగింది. ఆ ట్రైన్ ఢీకొని ముగ్గురు మరణించారు. పోలీసులు స్పాట్‌కు చేేరుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణ సతీమణి శోకసంద్రంలో మునిగిపోయింది. ఏకకాలంలో భర్త, ఇద్దరు కన్నబిడ్డలను కోల్పోవడంతో ఆమె రోధన.. అందరినీ కలచివేసింది.

Also Read: Dhanush Wayanad Landslide: వయనాడ్ బాధితులకు ధనుష్ సాయం.. లక్షల్లో విరాళం..


ఇదిలా ఉండగా, హైదరాబాద్ శివారులో నార్సింగి సమీపంలో టిప్పర్ లారీని ఓ కారు అమితవేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు యువకులు, టిప్పర్ లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మైహోమ్ అవతార్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గంటపాటు శ్రమిస్తేగానీ, కారులో నుంచి బాధితులను బయటికి తీయలేకపోయారు. కారు మితిమీరిన వేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.

కారులోని ముగ్గురు యువకులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులని తెలుస్తున్నది. ఈ నలుగురినీ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్చారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Related News

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Jubilee Hills: మాగంటి డెత్ మిస్ట‌రీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?

Jubilee Hills bypoll: జూబీహిల్స్‌ బైపోల్‌లో సైలెంట్ వేవ్ రాబోతుంది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Cyber Crime Hyderabad: సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. ఒక్క నెలలో 55 మంది అరెస్ట్

Big Stories

×