Warangal latest news(Today’s state news): కన్న కొడుకుని.. తండ్రే బజారులో అమ్మాడు. ఊహించని ఘటనతో అందరూ అవాక్కయ్యారు. వరంగల్ జిల్లాలో జరిగిందీ అమానుష ఘటన.
వరంగల్ నగరంలోని కరీమాబాద్కు చెందిన మసూద్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో MGMలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలోనే పెద్ద కుమారుడైన 4 సంవత్సరాల అయాన్ను తన అక్క ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. రెండు రోజులు గడిచినా.. అయాన్ మేనమామ అక్బర్.. తన అల్లుడిని తీసుకురావడానికి వెళ్లగా అక్కడ బాబు లేకపోవడంతో ప్రశ్నించాడు.
పిల్లాడి విషయంలో మసూద్ పొంతన లేని సమాధానాలు చెప్పటంతో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేసి బాలుడి ఆచూకీ కనుగొన్నారు. అతన్ని తల్లి దగ్గరకు చేర్చారు. బాలుని తీసుకెళ్లిన వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.