Media News Controversy: హైదరాబాద్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ప్రముఖ వార్తా సంస్థ ఎన్టీవీ (NTV), డిజిటల్ మీడియా ప్లాట్ఫారమ్ తెలుగు స్క్రైబ్, ఇతర న్యూస్ ఛానళ్లపై కేసు నమోదు చేశారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిణికి సంబంధించి ప్రసారమైన కథనాలపై ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఒక మహిళా ఐఏఎస్ అధికారిణిని ఒక మంత్రి వేధించినట్లుగా కొన్ని మీడియా సంస్థలు వార్తా కథనాలను ప్రసారం చేశాయి. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారిణి ప్రతిష్ఠను భంగపరిచేలా ఈ కథనాలు ఉన్నాయని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.
ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఎన్టీవీతో పాటు తెలుగు స్క్రైబ్ వంటి డిజిటల్ ఛానళ్లు ఈ వార్తను ఏ ప్రాతిపదికన ప్రసారం చేశాయనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.