E-Paper
Advertisement

Media News Controversy: ఎన్టీవీ, తెలుగు స్క్రైబ్‌లపై ఎఫ్ఐఆర్: ఐఏఎస్ అధికారిణి వార్తపై పోలీసుల యాక్షన్!

Media News Controversy: ఎన్టీవీ, తెలుగు స్క్రైబ్‌లపై ఎఫ్ఐఆర్: ఐఏఎస్ అధికారిణి వార్తపై పోలీసుల యాక్షన్!
Advertisement

Media News Controversy: హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ప్రముఖ వార్తా సంస్థ ఎన్టీవీ (NTV), డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ తెలుగు స్క్రైబ్, ఇతర న్యూస్ ఛానళ్లపై కేసు నమోదు చేశారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిణికి సంబంధించి ప్రసారమైన కథనాలపై ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ఐఏఎస్‌ అసోసియేషన్‌ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఫిర్యాదు చేశారు.

ఇటీవల ఒక మహిళా ఐఏఎస్ అధికారిణిని ఒక మంత్రి వేధించినట్లుగా కొన్ని మీడియా సంస్థలు వార్తా కథనాలను ప్రసారం చేశాయి. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారిణి ప్రతిష్ఠను భంగపరిచేలా ఈ కథనాలు ఉన్నాయని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.

Advertisement

ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఎన్టీవీతో పాటు తెలుగు స్క్రైబ్ వంటి డిజిటల్ ఛానళ్లు ఈ వార్తను ఏ ప్రాతిపదికన ప్రసారం చేశాయనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: ప్రాణం తీసిన బెట్టింగ్.. చెట్టుకు శవమై వేలాడుతూ.. షాద్‌నగర్‌లో దారుణం

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×