Fire accident A manufacturing company: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. విత్తనాలకు సంబంధించిన ఉత్పత్తులు చేసే కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా ఆ కంపెనీని చుట్టుముట్టడంతో స్థానికులు ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు, అధికారులు ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు అంచనా. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే ఎంత సరకు కాలిపోయింది, ఎంత డ్యామేజ్ అయ్యిందనేది తెలియాల్సివుంది. దేనికి సంబంధించిన విత్తనాలు అనేది కూడా తెలియాల్సివుంది.
ఘటన విషయం తెలియగానే కంపెనీకి సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. ఉన్నట్లుండి తెల్లవారుజామున సమయంలో షార్ట్ సర్క్యూట్ జరగడం ఏంటన్నది అసలు ప్రశ్న. కావాలనే ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా? ఇలా అనేక అనుమానాలు మొదలయ్యాయి. మరి అధికారుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో అగ్ని ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని ఓ పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. విత్తనాలకు సంబంధించిన ఉత్పత్తులు చేసే ఈ కంపెనీలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదం సంబవించింది. అగ్నిమాపకసిబ్బంది ఘటనా స్థలానికి… pic.twitter.com/JXYcZ1crbm
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2024