Food Poisoning: స్వేచ్చ బ్యూరో: సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన మరోసారి కలకలం రేపుతోంది. ఇల్లంతకుంట మండలం రామోజీపేట, సిరిసిల్ల అర్బన్ పెద్ద బోనాల, కోనరావుపేట మండలం కొండాపూర్ కు చెందిన పది మంది యువకులు జిల్లా కేంద్రంలోని ఓ మండి బిర్యాని సెంటర్లో బిర్యాని తిని గురువారం అస్వస్థత గురయ్యారు. వాంతులు విరోచనాలు జ్వరంతో కొంతమంది జిల్లా ప్రధాన ఆస్పత్రి, మరి కొంతమంది ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
Also read: Madhapur Murder: మాదాపూర్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. లొకేషన్ పంపి మరీ ప్రియుడిని లేపేసిన..?
ఆహార జరగడం వలన బాధితులకు ఫుడ్ పాయిజన్ అయిందని వైద్యులు ప్రాథమిక నిర్ధారణ చేశారు. బకాసుర మండి బిర్యాని సెంటర్లో బిర్యాని తినడం వల్లనే తమకు ఇలా జరిగిందని బాధితులు వాపోతున్నారు. కాగా జిల్లాలో ఇలా వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడంతో ప్రజలు బెంబేలేత్తిపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోటల్లు రెస్టారెంట్లు బిర్యాని సెంటర్లను తనిఖీలు చేసి ఆహార కల్తీలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read: కాంగ్రెస్ స్కామ్ల సర్కార్.. సర్వేల్లోనే తేలిపోయింది.. కేటీఆర్ ధ్వజం