E-Paper
Advertisement

BRS Chief KCR: 1.30 లక్షల మందితో సెక్రటేరియట్ ఎదుట ధర్నా చేస్తాం: కేసీఆర్

BRS Chief KCR:  1.30 లక్షల మందితో సెక్రటేరియట్ ఎదుట ధర్నా చేస్తాం: కేసీఆర్
Advertisement

BRS Chief KCR: ఎన్నో ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుదేలవుతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేవేళ్లలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చాలా ఏళ్లు కష్టపడి, పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి.. హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే.. దాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కుదేలు చేస్తోందన్నారు.

Advertisement

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి మాయం అయ్యిందని ఆరోపించారు. పదేళ్ల నాటి సమస్యలు రాష్ట్రంలో మరోసారి పునరావృతం అయ్యాయన్నారు. దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి.. కనీసం ఇప్పటికి రూ.10 లక్షలు కూడా ఇవ్వలేదన్నారు. ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా దళిత బంధు పథకాన్నే రద్దు చేసిందన్నారు.

Also Read: మూసీ ముస్తాబుపై ప్రభుత్వం స్సెషల్ ఫోకస్..

Advertisement

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రొసిడింగ్ అయిన 1.30 వేల మందికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వాళ్లందరినీ తీసుకొని వచ్చి సెక్రటేరియట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగి ప్రభుత్వం మెడలు వంచి ఆ నిధులు విడుదల చేపిస్తామని కేసీఆర్ హెచ్చిరించారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగేలా తాను బతికున్నంత వరకూ పోరాడుతానని కేసీఆర్ వెల్లడించారు. దళిత బంధు విషయంలో కాంగ్రెస్ నేతలను నియదీయాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×