E-Paper
Advertisement

బీఆర్ఎస్​ నేత ఇంట్లో భారీ చోరీ.. కోటిన్నరతో ఉడాయించిన దొంగలు!

బీఆర్ఎస్​ నేత ఇంట్లో భారీ చోరీ.. కోటిన్నరతో ఉడాయించిన దొంగలు!
Advertisement

House Burglary: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్​ఎస్ పార్టీ కీలక నేత ఇంట్లో దొంగలు పడ్డారు. కోటిన్నర రూపాయల నగదును తస్కరించి ఉడాయించారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ దొంగతనం సనత్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

బీఆర్​ఎస్ పార్టీ సీనియర్​ నేత, మాజీ ఎంపీ సురేశ్​ రెడ్డి సనత్ నగర్​ ప్రాంతంలోని జెడ్​ కాలనీలో నివాసముంటున్నారు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని అవకాశంగా చూసుకున్న దొంగలు లోపలికి చొరబడ్డారు. ఐరన్​ సేఫ్​ లో భద్రపరిచిన కోటిన్నర రూపాయల నగదు, ఇతర విలువైన సొత్తును తస్కరించి ఉడాయించారు.

Advertisement

ఆదివారం ఉదయం వచ్చిన సురేశ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్​ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషిస్తున్నారు. తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

Also Read: జలమండలి ఫలితమే దిక్సూచి.. జీహెచ్‌ఎంసీలోనూ కాంగ్రెస్‌దే గెలుపు: మహేష్ కుమార్ గౌడ్

Related News

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

పోలీస్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ న్యూస్ మీకోసమే

పెద్ద కూతురు పెళ్లి కోసం.. కన్న బిడ్డను అమ్ముకోవాలనుకున్న తల్లి.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×