E-Paper
Advertisement

బీఆర్ఎస్​ నేత ఇంట్లో భారీ చోరీ.. కోటిన్నరతో ఉడాయించిన దొంగలు!

బీఆర్ఎస్​ నేత ఇంట్లో భారీ చోరీ.. కోటిన్నరతో ఉడాయించిన దొంగలు!

House Burglary: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్​ఎస్ పార్టీ కీలక నేత ఇంట్లో దొంగలు పడ్డారు. కోటిన్నర రూపాయల నగదును తస్కరించి ఉడాయించారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ దొంగతనం సనత్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

బీఆర్​ఎస్ పార్టీ సీనియర్​ నేత, మాజీ ఎంపీ సురేశ్​ రెడ్డి సనత్ నగర్​ ప్రాంతంలోని జెడ్​ కాలనీలో నివాసముంటున్నారు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని అవకాశంగా చూసుకున్న దొంగలు లోపలికి చొరబడ్డారు. ఐరన్​ సేఫ్​ లో భద్రపరిచిన కోటిన్నర రూపాయల నగదు, ఇతర విలువైన సొత్తును తస్కరించి ఉడాయించారు.

ఆదివారం ఉదయం వచ్చిన సురేశ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్​ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషిస్తున్నారు. తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

Also Read: జలమండలి ఫలితమే దిక్సూచి.. జీహెచ్‌ఎంసీలోనూ కాంగ్రెస్‌దే గెలుపు: మహేష్ కుమార్ గౌడ్

Related News

జలమండలి ఫలితమే దిక్సూచి.. జీహెచ్‌ఎంసీలోనూ కాంగ్రెస్‌దే గెలుపు: మహేష్ కుమార్ గౌడ్

కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తారా? చరిత్ర ఉన్నంత వరకు ఆయనే ఉంటారు.. తలసాని హాట్ కామెంట్స్!

పగలు బీజేపీ.. రాత్రి బీఆర్ఎస్.. కిషన్ రెడ్డిపై రేవంత్ ఫైర్!

నీట్ సంక్షోభం కేంద్ర ప్రభుత్వ ‘అట్టర్ ప్లాప్’.. ఆ మంత్రిని తొలగించాల్సిందే- కేటీఆర్

కిషన్ రెడ్డివి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు.. ఎంపీ చామల సంచలన ఆరోపణలు!

ఫ్రీ చదువు, వైద్యం ఇవ్వకపోతే రాళ్లతో కొట్టండి.. కవిత సంచలన వ్యాఖ్యలు!

ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు.. రాసిపెట్టుకోండి- కిషన్ రెడ్డి

Big Stories

×