Revanth Proposal: నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రాక్ట్ అయ్యారు. పలు కీలక అంశాలపై సీఎం మాట్లాడారు. నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిదని అన్నారు. కేంద్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. దేశంలోని యువతకు చట్టసభల్లో చోటు దక్కాలని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ల వంటి అత్యున్నత పదవులు చేపడుతున్న యువతకు చట్టసభల్లో కూడా అవకాశం దక్కాలని సీఎం రేవంత్ తెలిపారు.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపికిగాను తగ్గింపు కోసం వచ్చే ఆగస్టులో తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేస్తామని సీఎం తెలిపారు. కేంద్రానికి సైతం మా తీర్మానాలను పంపుతామని అన్నారు. బెదిరింపులకు మేం భయపడం అని సీఎం రేవంత్ తెలిపారు.
Also Read: పంజాబీ బ్లూటూత్ స్కామ్ టు కర్ణాటక SSLC లీక్.. విపక్షాలకు కమలం గట్టి కౌంటర్!
ఈడీ, సీబీఐ దాడులతో యువతను, ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తే కుదరదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కొత్త నినాదం ఇకపై జై జవాన్, జై కిసాన్, జై యువ అనే కొత్త నినాదంతో ముందుకు వెళ్తుందని సీఎం తేల్చి చెప్పారు. దేశ రాజకీయాల్లో యువకుల పాత్ర ఎంతో కీలకం అని సీఎం రేవంత్ కొనియాడారు.
Also Read: నిజామాబాద్లో ఘోర విషాదం.. ఎస్సారెస్పీ బ్యాక్వాటర్స్లో నలుగురు యువకులు గల్లంతు!