Gajwel District Hospital: స్వేచ్ఛ బ్యూరో: గజ్వేల్ జిల్లా ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చికిత్స విజయవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్(Hydrabad)కు చెందిన 43 ఏళ్ల మహిళ గర్భాశయంలో పెరిగిన భారీ ఫైబ్రైడ్ (లియోమయోమా) ను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. బాధిత మహిళ 24 వారాల గర్భవతి కాగా (సుమారు 13/11/10 సెంటీమీటర్లు) పరిమాణంలో ఉన్న పెద్ద గర్భాశయ కణితతో బాధపడుతోంది.
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ పర్యవేక్షణలో డాక్టర్ త్రివేణి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రేమ్ కిషోర్, అనస్థీషియా నిపుణులు డాక్టర్ మైపాల్, డాక్టర్ సతీష్ కుమార్ మరియు నర్సింగ్ సిబ్బందితో కూడిన బృందం ఈ క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించి కణితను తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయ ఫైబ్రైడ్లు సాధారణమే అయినా ఇంత పెద్ద పరిమాణంలో ఉండటం అరుదని తెలిపారు.
Also Read: Rajya Sabha: రాజ్యసభ సీటుపై వీడనున్న సస్పెన్స్.. అదృష్టం ఎవరికి వరించెనో..?
పొత్తికడుపులో నొప్పి, బరువుగా ఉండటం. తరచుగా మూత్ర విసర్జన మరియు వెన్నునొప్పి సంతానలేమి లేదా పదేపదే గర్భస్రావాలు అవ్వడం, లాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. విజయవంతంగా ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించగా, రోగి బంధువులు ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.