E-Paper
Advertisement

గండిపేట భూ కబ్జా కేసులో సంచలనం.. జీవోల కోసం 4కోట్లు..!

గండిపేట భూ కబ్జా కేసులో సంచలనం.. జీవోల కోసం 4కోట్లు..!
Advertisement

Land Scam: స్వేచ్ఛ బ్యూరో: గండిపేట భూ కబ్జా కేసులో సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. నకిలీ జీవోలు, ఇతర డాక్యుమెంట్లను సృష్టించటానికి వైఎస్​ఆర్​సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు 4కోట్ల రూపాయలను రాధాకృష్ణ అనే మరో నిందితునికి ఇచ్చినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. కాగా, కేసులు నమోదు కాగానే పారిపోయిన రాధాకృష్ణ (53)తోపాటు అతని డ్రైవర్​ ప్రవీణ్​ కుమార్​ (34)ను తాజాగా నార్సింగి పోలీసులు అరెస్ట్​ చేశారు. దీంతో ఈ కేసులో కటకటాల వెనక్కి వెళ్లిన నిందితుల సంఖ్య అయిదుకు చేరింది. శేరిలింగంపల్లి జోన్​ డీసీపీ సీ.హెచ్​.శ్రీనివాస్​, సైబర్​ క్రైం డీసీపీ సాయి మనోహర్​ తో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

కీలక నిందితుడు..

గండిపేట గ్రామంలో సర్వే నెంబర్​ 18లోని పదిహేను వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ పోరంబోకు భూమిని కబ్జా చేయటానికి కొంతమంది ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీని కోసం నిందితులు ఏకంగా ఫోర్జరీ చేసిన ప్రభుత్వ జీవోలు, ఇతర డాక్యుమెంట్లను సృష్టించారు. ఇవి సోషల్​ మీడియాలో వైరల్​ కాగా చూసిన గండిపేట మండలం తహసిల్దార్​ దీనిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే గండిపేట గ్రామానికి చెందిన నిమ్మల రాజేశ్​, నిమ్మల వేణుగోపాల్​, నిమ్మల సాయికిరణ్​ ను అరెస్ట్​ చేశారు. వీరిని జరిపిన విచారణలో వైఎస్ఆర్​సీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతోపాటు మరికొందరికి కూడా దీంట్లో సంబంధం ఉందని వెల్లడైంది. ఈ క్రమంలో పరారీలో ఉన్న వారి కోసం గాలింపును ముమ్మరం చేసిన నార్సింగి పోలీసులు తాజాగా కీలక నిందితుడు రాధాకృష్ణ, అతని డ్రైవర్​ ప్రవీణ్ కుమార్​ లను అరెస్ట్​ చేశారు.

ఆ శాఖలో అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగిగా..

Advertisement

విచారణలో రాధాకృష్ణ గతంలో ఆంధ్రప్రదేశ్​ సెక్రటేరియట్​ లోని ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ, కమ్యూనికేషన్​ విభాగంలో అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగిగా పని చేశాడు. ఆ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, విధానాల గురించి క్షుణ్నంగా తెలుసుకున్నాడు. ఆ తరువాత ఉద్యోగం మానేసి అక్రమాలకు తెర లేపాడు. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు, భూ క్రమబద్దీకరణ ఉత్తర్వులు, పట్టాదారు పాస్​ పుస్తకాలు, వారసత్వ ధృవీకరణ పత్రాలు, ఇతర ప్రభుత్వ అనుమతులు సైతం ఇప్పటిస్తానని నమ్మిస్తూ జనాన్ని మోసం చేయటం మొదలు పెట్టాడు. సెక్రటేరియట్​ లో తాను డిప్యూటీ కలెక్టర్​ గా పని చేస్తున్నానని చెప్పి 2013లో కరీంనగర్​ కు చెందిన పలువురు యువకుల నుంచి 30లక్షల రూపాయలు కొల్లగొట్టాడు. ఈ మేరకు కరీంనగర్​ వన్​ టౌన్​ స్టేషన్​ లో అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తరువాత కూడా మోసాలు సాగిస్తూ వచ్చిన రాధాకృష్ణపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు పోలీస్​ స్టేషన్లలో క్రిమినల్​ కేసులు రిజిష్టరయ్యాయి.

Also Read: Khammam: ఖమ్మంలో తొలి మహిళా సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభం!

మరింత సంపాదించాలని..

Advertisement

ఇలా ఉద్యోగాల పేర మోసాలు చేసి కొల్లగొట్టిన డబ్బుతో జల్సా జీవితానికి అలవాటు పడ్డ రాధాకృష్ణ మరింతగా సంపాదించటానికి భూములకు సంబంధించిన మోసాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతనికి గండిపేటలోని ప్రభుత్వ పోరంబోకు భూమి తమది అని చెప్పుకొన్న వారితో పరిచయం ఏర్పడింది. అదే సమయంలో ఈ భూమిని కొనాలనుకున్న వైఎస్​ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అతని సోదరుడు బొల్లా రమేశ్​ లతో కూడా పరిచయం చేసుకున్నాడు. అవసరమైన అన్ని డాక్యుమెంట్ల తాను తయారు చేసి ఇస్తానని వారికి చెప్పాడు. దాంతో బొల్లా బ్రహ్మనాయుడు అతనికి 4కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఆ తరువాత రాధాకృష్ణ ఓ న్యాయవాది సాయంతో నకిలీ జీవోలు, తప్పుడు సీసీఎల్ఏ ప్రొసీడింగ్స్​, నకిలీ ఎన్​వోసీలు, అధికారిక లేఖలు, ఇతర ప్రభుత్వ పత్రాలను సృష్టించాడు. వీటిపై సీనియర్ ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు.

కేసులు నమోదు..

ఈ క్రమంలో బొల్లా బ్రహ్మనాయుడు నుంచి సదరు న్యాయవాదికి మరో 4కోట్ల రూపాయలు ఇప్పించాడు. విచారణలో కొవ్వూరు సునీల్, కరణం రాజేష్, ప్రవీణ్ కుమార్​, ప్రభుదాస్ లు రాధాకృష్ణకు సహకరించినట్లు తేలింది. కేసులు నమోదు కాగానే రాధాకృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోగా ప్రవీణ్​ కుమార్​ ఫోర్జరీ ద్వారా సృష్టించిన డాక్యుమెంట్లను దాచి పెట్టాడు. పోలీసుల కదలికల గురించి ఎప్పటికప్పుడు రాదాకృష్ణకు సమాచారం ఇస్తూ వచ్చాడు. అయితే, సాంకేతిక ఆధారాలతో పక్కాగా సమాచారాన్ని సేకరించిన పోలీసులు రాధాకృష్ణ, ప్రవీణ్​ కుమార్​ లను అరెస్ట్ చేశారు. వారి నుంచి కొన్ని ఒరిజినల్​ జీవోలతోపాటు ఫోర్జరీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు, 5 ల్యాప్​ టాప్​ లు, 12 చెక్‌ బుక్కులు, 13 ఫోర్జరీ స్టాంపులు, 7బ్యాంక్​ పాస్​ బుక్కులు, 10 ఏటీఎం కార్డులు, వేర్వేరు భూములకు చెందిన 31 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగితా నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు డీసీపీ శ్రీనివాస్​ చెప్పారు.

Also Read: వైద్యుల నిర్లక్ష్యంతో.. వికలాంగుడిగా మారిన ఏడు నెలల పసికందు

Related News

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

బహదూర్‌గూడలో హైటెన్షన్.. పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరేసిన రైతులు.. ఎందుకంటే?

Food Adulteration Law: ఆహార కల్తీ దందాకు ఇక చెక్.. తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టం ఇదే!

Big Stories

Advertisement
×