GHMC Council Meeting: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ, మజ్లిస్ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. వందేమాతరం గీతాలాపన సమయంలో మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో నుంచి లేవలేదని బీజేపీ సభ్యులు తప్పుబట్టారు. వందేమాతరం పాడితేనే దేశంలో ఉండాలని బీజేపీ కార్పొరేటర్లు అనడంతో కాసేపు బీజేపీ, మజ్లిస్ మధ్య తోపులాట చోటుచేసుకుంది.
మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ, మజ్లిస్ సభ్యులు కుర్చీలపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. సభ్యుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్తో బయటకు పంపుతానని అనడంతో కాసేటికి గొడవ సర్దుమణిగింది. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతాలాపనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మేయర్ ను కోరారు. అలాగే అందెశ్రీకి నివాళిగా జయజయహే తెలంగాణ కూడా పాడుదాం అని కోరారు. దీనిని ఎంఐఎం సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించింది.
GHMC కౌన్సిల్ సమావేశంలో రసాభాస
వందేమాతరం, జాతీయ గీతాలాపన సమయంలో కుర్చీలో నుంచి లేవని మజ్లిస్ కార్పొరేటర్లు
మజ్లిస్ కార్పొరేటర్లు లేవకపోవడాన్ని తప్పుబట్టిన బీజేపీ
దీంతో బీజేపీ, మజ్లిస్ మధ్య కాసేపు వాగ్వాదం pic.twitter.com/yB0ImNe3V9
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2025
కౌన్సిల్ లో వందేమాతరం గీతాలాపన జరిగింది. ఎంఐఎం కార్పొరేటర్ సోహెల్ వందేమాతరం గీతాలాపన సమయంలో నిలబడకుండా కూర్చొని నిరసన తెలిపారు. వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలాపన సమయంలో మబ్లిస్ కార్పొరేటర్లు కూర్చొనే ఉన్నారు. బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు పార్టీల సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఒకరినొకరు తోసుకున్నారు. కౌన్సిల్లో రసాభాసతో మార్షల్స్ ఎంట్రీ ఇచ్చారు. మనమేమైనా రౌడీలమా? అంటూ మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Constable Dance: ఏకాంత సేవ అంటూ మహిళతో కానిస్టేబుల్ అశ్లీల నృత్యాలు.. సస్పెండ్ చేసిన ఎస్పీ