E-Paper
Advertisement

Medaram: మేడారానికి పోటెత్తిన భక్తులు.. సెలవు దినం కావడంతో కిక్కిరిసిన జనం

Medaram: మేడారానికి పోటెత్తిన భక్తులు.. సెలవు దినం కావడంతో కిక్కిరిసిన జనం
Advertisement

Medaram: మేడారం క్షేత్రం భక్తుల జనసందోహంతో పోటెత్తింది. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న మహా జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని, ముందస్తుగానే తమ ఇష్టదైవాలకు మొక్కులు చెల్లించుకోవాలని వేలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. దీంతో అరణ్య ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో పులకించిపోతోంది.

భక్తులు ముందుగా పవిత్ర జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తడి బట్టలతోనే వనదేవతల దర్శనానికి క్యూ కడుతున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు తమ మొక్కుల రూపంలో అమ్మవార్లకు ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించి, ధూప దీప నైవేద్యాలతో భక్తిని చాటుకుంటున్నారు. అడవి మార్గాలన్నీ ‘సమ్మక్క-సారలమ్మ’ నామస్మరణతో మారుమోగుతున్నాయి.

Advertisement

మరోవైపు, ప్రతిష్టాత్మకమైన మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ స్వయంగా మేడారంలో పర్యటించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

వాహనాల రాకపోకలు పెరగడంతో మేడారం పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ మళ్లించడం, అదనపు బలగాలను మోహరించడం వంటి చర్యల ద్వారా భక్తుల ప్రయాణం సుఖమంతం అయ్యేలా చూస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా నేత్రాలను (CCTV) కూడా పటిష్టం చేశారు.

Advertisement

Also Read: గుంటూరులో అర్ధరాత్రి యువకుల వీరంగం.. నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న బావ-బామ్మర్దులు

కేవలం భద్రత మాత్రమే కాకుండా, భక్తుల మౌలిక వసతులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. మేడారం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ రాజ్ శాఖ చర్యలు తీసుకుంటోంది. వనదేవతల ఆశీస్సుల కోసం వస్తున్న భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

Related News

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

Big Stories

Advertisement
×