PAK VS SL T20 2026 : సాధారణంగా పాకిస్తాన్ క్రికెట్ ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎప్పుడు ఏ ఆటగాడు ఆడుతాడో ఏ ఆటగాడు ఆడడో అర్థం కానీ పరిస్థితి. ఈ మధ్య కాలంలో వరుస ఓటమిలతో మూటగట్టుకుంటున్న పాక్.. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఆ నిర్ణయాలతో క్రికెట్ ఆటను గాడిలో పెట్టాలని భావిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. శ్రీలంకతో జరగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆ జట్టులోని ముగ్గురు అగ్రశ్రేణి ఆటగాళ్లు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిదీలకు విశ్రాంతినివ్వాలని నిర్ణయించింది. సీనియర్లకు రెస్ట్ ఇచ్చి, యువ రక్తాన్ని పరీక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : U-19 World Cup : వరల్డ్ కప్ టీమ్ లో హైదరాబాద్ కుర్రాడు.. అరోన్ జార్జ్ ఆరా..!
పాకిస్తాన్ క్రికెట్లో ప్రక్షాళన మొదలైంది. గత కొంతకాలంగా నిలకడలేని ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న సీనియర్ ఆటగాళ్లపై పీసీబీ సెలక్షన్ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే శ్రీలంక పర్యటనకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీలను శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు. వీరికి విశ్రాంతి కల్పించడం ద్వారా, యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ వేదికపై అవకాశం కల్పించాలని బోర్డు భావిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నీల కోసం బెంచ్ స్ట్రెంత్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీబీ ఈ అడుగు వేసింది. బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఆడుతున్న సమయంలో షాహీన్ అఫ్రిదీ మోకాలి గాయానికి గురైన సంగతి తెలిసిందే. దీనివల్ల అతనికి విశ్రాంతి తప్పనిసరి అయింది. మరోవైపు, బాబర్, రిజ్వాన్ గత కొన్ని నెలలుగా వరుసగా క్రికెట్ ఆడుతుండటంతో, వారి పనిభారాన్ని (Workload Management) తగ్గించడానికి సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో, జట్టు బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. యువ ఆటగాడు సల్మాన్ అలీ ఆఘా లేదా మరేదైనా కొత్త పేరును కెప్టెన్గా ప్రకటించే అవకాశం ఉంది. పిఎస్ఎల్ (PSL), దేశవాళీ క్రికెట్లో రాణించిన పలువురు యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ ద్వారా జాతీయ జట్టులోకి పిలుపు లభించింది. పాకిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటించి మూడు టీ20లు మరియు మూడు వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్ కోసం ప్రకటించిన ఈ మార్పులు వన్డే సిరీస్లో కూడా కొనసాగుతాయా లేదా అనేది చూడాలి. శ్రీలంక వంటి ఉపఖండ పరిస్థితుల్లో యువ ఆటగాళ్లు తమ సత్తా చాటుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక అని చెప్పవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి మరీ.
Also Read : DC Vs MIE : పొలార్డ్ విధ్వంసం.. ఒకే ఓవర్ లో 6, 4, 2, 6, 6, 6