E-Paper
Advertisement

GHMC CRMP-2: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్.. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం

GHMC CRMP-2: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్.. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
Advertisement

GHMC CRMP-2: గ్రేటర్ హైదరాబాద్ లో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఇప్పటికే హెచ్ సిటీ పనులను పట్టాలెక్కించిన జీహెచ్ఎంసీ.. మరో ప్రయత్నం చేసేందుకు సిద్దమైంది. గత బీఆర్ఎస్ పాలనలో రోడ్ల మెరుగైన నిర్వహణ కోసం అమలు చేసిన కాంప్రాహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రొగ్రామ్ (సీఆర్ఎంపీ) రెండో దశను అమలు చేసేందుకు సిద్దమైంది. ముఖ్యంగా రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి వాటిని జవాబుదారిని చేయటంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు వంటివి పారదర్శకంగా చేసేలా సీఆర్ఎంపీ-2 ను అమలు చేయనుంది.

ఇప్పటి వరకు ప్రతిపాదనల స్థాయిలో ఉన్న ఈ అంశానికి గతంలోనే స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ ఆమోదించగా తాజాగా సోమవారం నిర్వహించిన కార్పొరేషన్ సమావేశం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం రూ. 3145 కోట్ల వ్యయంతో సిటీలోని సుమారు 1045.01 కిలోమీటర్ల పొడువున రోడ్లకు మెరుగైన మెయింటనెన్స్ బాధ్యతలను చేపట్టనున్నారు. వీటిలో ఈ మెయింటనెన్స్ పనులను మూడు రకాలుగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. వీటిలో ఫస్ట్ సుమారు 744.22 కిలోమీటర్ల బీటీ, సీటీ రోడ్లను.. రూ. 2230 కోట్లతో మెయింటనెన్స్ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నారు.

Advertisement

అలాగే అదనంగా సుమారు 64.49 కిలోమీటర్ల సీసీ రోడ్లను రూ. 208 కోట్ల వ్యయంతో మెరుగైన నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నారు. దీంతో పాటు మరో 236.30 కిలోమీటర్ల పొడువున్న బీటీ రోడ్ల నిర్వహణ బాధ్యతలను సుమారు రూ. 707.07 కోట్లతో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు తెలిసింది. గతంలో అమలు చేసిన సీఆర్ఎంపీ-1 లో సుమారు 744.22 కిలోమీటర్ల రోడ్లకు మెరుగైన నిర్వహణ బాధ్యతలను అప్పగించగా మరో 300.79 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లను కూడా మెరుగైన మెయింటనెన్స్ కోసం ఏజెన్సీలకు అప్పగించారు.

Also Read: Air Cooler Buying Tips: బెస్ట్ కూలర్‌ ఎంచుకునే 4 చిట్కాలు.. వీటిని పాటించకపోతే.. మీ డబ్బు వృథానే!

Advertisement

కాంప్రాహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రొగ్రామ్ (సీఆర్ఎంపీ) రెండో దశ కింద సుమారు రూ. 3145 కోట్ల వ్యయంతో సిటీలోని సుమారు 1045.01 కిలోమీటర్ల పొడువున రోడ్లకు మెరుగైన మెయింటనెన్స్ బాధ్యతలను చేపట్టనున్న నిర్వహణ ఏజెన్సీలు పదేళ్ల పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నాయి. గత గులాబీ పాలనలో కూడా సీఆర్ఎంపీ-1 ను అమలు చేసినప్పటికీ, అందులో కొన్ని సంస్థలు నిర్వహణ బాధ్యతలను సక్రమంగా, పారదర్శకంగా చేపట్టడంలో విఫలయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తటంతో అధికారులు ఈ సారి నిర్వహణ నిబంధనలను కొంత కఠినతరం చేయనున్నట్లు తెలిసింది. స్ట్రెచ్ ల వారీగా ఏజెన్సీలకు బీటీ, సీసీ రోడ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ ఏజెన్సీలు ప్రతి రోడ్డుకు ఖచ్చితంగా పేమెంట్లను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.

Also Read: Top 10 Cars Feb 2026: టాటా నెక్సాన్ To షిఫ్ట్ డిజైర్.. ఫిబ్రవరిల్లో అమ్మకాల్లో దుర్మురేపిన కార్లు ఇవే!

Related News

El Niño: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు.. మీ జిల్లాకు ఇన్చార్జ్ అధికారి ఎవరో తెలుసా..?

Insurance: కేంద్రం ఓకే.. కానీ రాష్ట్రానికే ఏమైంది?.. పెండింగ్‌లో 5 లక్షల బీమా..!

బుల్లెట్ ట్రైన్ హబ్‌కు హైకోర్టు బ్రేక్.. బహదూర్ గూడ రైతులకు బిగ్ రిలీఫ్!

CMO Report: సీఎం రేవంత్ బ్లాక్ లిస్ట్‌లో 26 మంది ఎమ్మెల్యేలు.. అక్కడ కాంగ్రెస్ దుకాణం బంద్?

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి!

తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

Big Stories

Advertisement
×