Khammam: ఖమ్మం జిల్లా ఏన్కూర్ పోలీస్ స్టేషన్లో దారుణ గటన చోటు చేసుకుంది. భర్త భార్యను కత్తితో అతి దారుణంగా కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. అయితే కుటుంబ కలహాల కారణంగా రెండేళ్లుగా తల్లిగారి వద్ద ఉంటున్న భార్య ఉంటుంది.
డ్వాక్రా రుణ బకాయిల విషయంలో భార్య బ్యాంకు వద్దకు మహిళా గ్రూప్ సభ్యులతో కలిసి వచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న అతడు బ్యాంకు వద్దకు వచ్చిన రాంబాబు భార్య పై గొడవ చేయడంతో అక్కడి వాళ్లు డయల్-100కు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఇరువురినీ తీసుకోని ఏన్కూర్ పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు.
Also read: Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!
పోలీస్ స్టేషన్లో భార్యపై అతి దారుణంగా కత్తితో భార్య పై దాడి చేశాడు. దాడిలో బాధితురాలి కుడి భుజం, మణికట్టుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు మహిళను ఏన్కూర్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సకోసం తరలించారు. అనంతరం ఖమ్మంజిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read: తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?