E-Paper
Advertisement

బిల్డ్ నౌ పోర్టల్ మ్యాజిక్.. జీహెచ్‌ఎంసీ సరికొత్త రికార్డు.. గత ఏడాది కంటే ఆదాయంలో పెరిగిన వృద్ధి

బిల్డ్ నౌ పోర్టల్ మ్యాజిక్.. జీహెచ్‌ఎంసీ సరికొత్త రికార్డు.. గత ఏడాది కంటే ఆదాయంలో పెరిగిన వృద్ధి

GHMC Financial Statistics: హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక గణాంకాలను విడుదల చేసింది. నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా ప్రవేశపెట్టిన BuildNow పోర్టల్ ద్వారా అనుమతుల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 17,957 నిర్మాణ లేఅవుట్ అనుమతులు మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. పారదర్శకతను పెంచుతూ ముఖ్యమంత్రి గారు 2025 మార్చిలో ప్రారంభించిన ఈ పోర్టల్ ద్వారా సామాన్యులకు ఇళ్ల నిర్మాణ అనుమతులు సులభతరం అయ్యాయ‌ని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ మంజూరు చేసిన మొత్తం 15,536 నిర్మాణ అనుమతుల్లో అత్యధిక భాగం Instant Approval విధానం ద్వారా జారీ అయ్యాయి. 75 చదరపు గజాల నుండి 600 చదరపు గజాల లోపు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఈ విధానం వరంగా మారింది. ఈ కేటగిరీ కింద 12,014 అనుమతులు మంజూరయ్యాయి. అలాగే 75 చదరపు గజాల లోపు చిన్న ఇళ్లకు సంబంధించి 972 ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. బహుళ అంతస్తుల భవనాలు మరియు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన Single Window విధానం ద్వారా 2,515 అనుమతులు మంజూరు కాగా 29 లేఅవుట్ అనుమతులు జారీ అయ్యాయి. అదనంగా 2,427 Occupancy Certificates కూడా జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా జీహెచ్‌ఎంసీకి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,172.08 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో నమోదైన రూ. 1,138.44 కోట్లతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధిని సూచిస్తోంది. కార్పొరేషన్ వారీగా చూస్తే సీఎంసీ (CMC) పరిధిలో రూ. 538.09 కోట్లతో ప్రథమ స్థానంలో ఉండగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 436.47 కోట్లు మరియు ఎంఎంసీ (MMC) పరిధిలో రూ. 198.24 కోట్ల ఆదాయం వసూలైంది. భవన నిర్మాణ నిబంధనలను సరళీకృతం చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరగడమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకుందని అధికారులు విశ్లేషిస్తున్నారు.

బిల్డ్ నౌ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అనుమతులు లభిస్తున్నాయి. ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్ మరియు అప్రూవల్ పొందిన తర్వాత క్షేత్రస్థాయిలో పోస్ట్ వెరిఫికేషన్ నిర్వహించి వర్క్ కమెన్స్‌మెంట్ లెటర్లను జారీ చేస్తున్నారు. దీనివల్ల అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పిందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పారదర్శకతను కొనసాగిస్తూ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించడమే లక్ష్యమని జీహెచ్‌ఎంసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

Read Also: నింగిలోనూ తప్పని సాఫ్ట్‌వేర్ తిప్పలు.. ఆర్టెమిస్ II లో మొరాయించిన మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్!

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×