Bridge Collapse: స్వేచ్చ బ్యూరో: గోదావరి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు భారీగా కుంగింది. రాకపోకలను తక్షణమే నిలిపివేశారు. ప్రస్తుతం రాకపోకలన్నీ కొత్త వంతెన మీదుగా జరుగుతున్నాయి. భారీ వాహనాల రాకతో పాత బ్రిడ్జి పై ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం వద్ద అకస్మాత్తుగా కుంగిన గోదావరి రెండో బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు దీనిపై రాకపోకలు బందయ్యాయి.
ఏడాదికే భద్రాచలం బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కుంగడంతో అప్రోచ్ రోడ్డు పనులకు నాసిరకం గ్రావెల్ వాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటా మని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నాటి భద్రాచలం పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ కృషి మేరకు గోదావరి నది పై రెండో వంతెన మంజూరైంది. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు 10 ఏళ్ల కు పైగా సాగాయి. ఏడాది క్రితమే ప్రారంభమైంది.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. స్విమ్మింగ్ పూల్లో మునిగి తెలుగు యువతి దుర్మరణం
గత బిఆర్ఎస్ హయాంలో అప్రోచ్ రోడ్డు పనులు సాగాయి. ఐతే భద్రాచలం – సారపాక మధ్య ఉన్న గోదావరి నదిపై నిర్మించిన రెండో కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు అకస్మాత్తుగా కుంగినందున దీనిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పాత మెదటి బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. కేబినెట్లో వారికే చోటు, ఆ కీలక నేతలు ఎవరెవరంటే