E-Paper
Advertisement

Sankranti: బాలయ్యకు జగన్ గుడ్ న్యూస్.. వీరసింహారెడ్డికి పండగే.. వాల్తేరు వీరయ్యకు కూడా..

Sankranti: బాలయ్యకు జగన్ గుడ్ న్యూస్.. వీరసింహారెడ్డికి పండగే.. వాల్తేరు వీరయ్యకు కూడా..
Advertisement

Sankranti: పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అంటే ఏపీలో అదో టెన్షన్. జగన్ సర్కారు ఏ రూపంలో అడ్డుకుంటుందనే ఆరాటం. భీమ్లా నాయక్ సమయంలో టికెట్ రేట్లు తగ్గించి.. పవన్ సినిమాను దెబ్బకొట్టాలని చూశారంటారు. ఆ తర్వాత టికెట్ ధరల తగ్గింపు అనేక మలుపులు తిరిగి.. మళ్లీ మామూలు స్థితికి వచ్చింది. తాజాగా, ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పొలిటికల్ వార్ జోరుగా సాగుతుండగా.. ఈ సమయంలో సంక్రాంతికి ఎమ్మెల్యే కం హీరో బాలయ్య సినిమా రిలీజ్ అవుతుండటంతో మరోసారి ఉత్కంఠ. ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అనే అనుమానం. కానీ, ఒకప్పుడు బాలయ్య ఫ్యాన్ అయిన జగన్.. వీరసింహారెడ్డికి గుడ్ న్యూసే చెప్పారు. సంక్రాంతికి సినిమా టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీకి కూడా టికెట్ రేట్ల పెంపు వర్తిస్తుంది.

పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్‌ ధరలు పెంచుకునేలా గతంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. సంక్రాంతికి విడుదలవుతున్న ‘వీరసింహారెడ్డి’ (veera simha reddy), ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya) టికెట్‌ ధరలను గరిష్టంగా రూ.70 పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ.. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఏపీ సర్కారును కోరింది. అయితే, టికెట్‌పై మాగ్జిమమ్ రూ.45 (జీఎస్టీ అదనం) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం మరింత బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్పెషల్‌ షోలకు అనుమతి ఇచ్చింది. సంక్రాంతికి ఏకంగా 6 షోలు ప్రదర్శించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే, పండుగ నాడు తెల్లవారుజాము 4 గంటలకే అసలైన సినిమా పండగ మొదలైనట్టే.

జనవరి 12న బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీరసింహారెడ్డి’.. జనవరి 13న చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కానున్నాయి. రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసనే హీరోయిన్. రెండూ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే వస్తున్నాయి. గతంలో సంక్రాంతికి ఒకేసారి బాలయ్య, చిరు సినిమాలు రిలీజ్ అయితే.. ఆ రెండు చిత్రాల మధ్య తీవ్ర పోటీ ఉండేది. ఫ్యాన్స్ నువ్వా-నేనా అన్నట్టు రెచ్చిపోయేవారు. కానీ, ఈసారి అంతా ఓ అండర్ స్టాండింగ్ లో ఉన్నారు. అన్ స్టాపబుల్ షోతో నందమూరి-అల్లు-మెగా కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. సో, ఈసారి సంక్రాంతికి బాలయ్య వర్సెస్ చిరంజీవిల మధ్య ఫ్రెండ్లీ ఫైటింగ్ ఉండబోతోంది.

Tags

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×