BigTV English
Advertisement

Governor Quota MLCs Oath : ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఇష్యూ.. స్పందించిన మండలి ఛైర్మన్ గుత్తా..

Governor Quota MLCs Oath : ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఇష్యూ.. స్పందించిన మండలి ఛైర్మన్ గుత్తా..
Political news in Telangana

Governor Quota MLCs Oath(Political news in telangana):

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకార అంశం ఉత్కంఠగా మారింది. సోమవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్లిన ఇద్దరు నేతలకూ నిరాశ ఎదురైంది. రెండు గంటలపాటు కౌన్సిల్​ హాల్‌లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోసం వేచి చూశారు. అయితే.. దీనిపై స్పందించిన కోదండరాం.. తాము మండలి ఛైర్మన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వెళ్లామని చెప్పారు. ఈనెల 31న ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించాలని సందేశం పంపినట్లు సమాచారం.


తాను అందుబాటులో లేననే అంశంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్ మాత్రమే ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాల్సిందిగా తనను అడిగారని.. 31న మధ్యాహ్నం మూడున్నర గంటలకు వస్తానని చెబితే తాను అంగీకరించానని తెలిపారు. మిగతా ఎమ్మెల్సీతోనూ అదేరోజు ప్రమాణం చేయించేలా ఏర్పాట్లు చేయాలని తాను అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కోదండరాం, అమీర్ అలీఖాన్ సమాచారం ఇవ్వకుండానే ప్రమాణం కోసమంటూ తన కార్యాలయానికి వచ్చారని సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. మండలి ఛైర్మన్‌గా తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.


Tags

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×