E-Paper
Advertisement

Governor Quota MLCs Oath : ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఇష్యూ.. స్పందించిన మండలి ఛైర్మన్ గుత్తా..

Governor Quota MLCs Oath : ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఇష్యూ.. స్పందించిన మండలి ఛైర్మన్ గుత్తా..
Advertisement
Political news in Telangana

Governor Quota MLCs Oath(Political news in telangana):

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకార అంశం ఉత్కంఠగా మారింది. సోమవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్లిన ఇద్దరు నేతలకూ నిరాశ ఎదురైంది. రెండు గంటలపాటు కౌన్సిల్​ హాల్‌లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోసం వేచి చూశారు. అయితే.. దీనిపై స్పందించిన కోదండరాం.. తాము మండలి ఛైర్మన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వెళ్లామని చెప్పారు. ఈనెల 31న ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించాలని సందేశం పంపినట్లు సమాచారం.

తాను అందుబాటులో లేననే అంశంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్ మాత్రమే ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాల్సిందిగా తనను అడిగారని.. 31న మధ్యాహ్నం మూడున్నర గంటలకు వస్తానని చెబితే తాను అంగీకరించానని తెలిపారు. మిగతా ఎమ్మెల్సీతోనూ అదేరోజు ప్రమాణం చేయించేలా ఏర్పాట్లు చేయాలని తాను అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కోదండరాం, అమీర్ అలీఖాన్ సమాచారం ఇవ్వకుండానే ప్రమాణం కోసమంటూ తన కార్యాలయానికి వచ్చారని సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. మండలి ఛైర్మన్‌గా తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Tags

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×