E-Paper
Advertisement

Hanumakonda Collector: విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇన్నోవేటివ్‌గా బోధించాలి : కలెక్టర్ స్నేహ శబరీష్

Hanumakonda Collector: విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇన్నోవేటివ్‌గా బోధించాలి : కలెక్టర్ స్నేహ శబరీష్
Advertisement

Hanumakonda Collector: కమలాపూర్  బ్యూరో, స్వేచ్ఛ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు సృజనాత్మకంగా, ఇన్నోవేటివ్ పద్ధతుల్లో బోధించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గూడూరుతో పాటు ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకొని, ముఖ గుర్తింపు విధానంలో హాజరు నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఆరు, పదో తరగతుల గదులను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి బోధన విధానంపై అభిప్రాయాలు అడిగారు.

Also Read: IBomma Ravi: ఐ బొమ్మ రవికి భారీ ఊరట… షరతులతో కూడిన బెయిల్ మంజూరు..

ఇంగ్లీష్ పాఠ్యాంశ బోధనను పరిశీలించిన కలెక్టర్

Advertisement

లెట్స్ ఎన్‌రిచ్ ఇంగ్లీష్ పాఠ్యాంశ బోధనను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల ఆంగ్ల ప్రావీణ్యంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలు విద్యార్థులకు స్పష్టంగా అర్థమవుతున్నాయా అనే విషయాన్ని తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో అన్ని తరగతులను పరిశీలించిన కలెక్టర్, ఐదో తరగతి విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడించి వారి పఠన నైపుణ్యాలను పరీక్షించారు. పాఠశాల ప్రాంగణ పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు, వంటగది, మరుగుదొడ్ల నిర్మాణ స్థితిని పరిశీలించారు. అసంపూర్తిగా, నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వాటి వివరాలతో రెండు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని డీఈవోను ఆదేశించారు.

విద్యార్థులను బయట కూర్చోబెట్టడం సరికాదు 

క్లాస్‌రూమ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులను బయట కూర్చోబెట్టడం సరికాదని హెచ్చరించారు. పాఠశాల వాతావరణం పరిశుభ్రంగా, సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆంగ్ల భాషలో పట్టు సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదాల సరైన ఉచ్చారణ, అర్థ వివరణతో పాటు ఆంగ్ల పదాలను తెలుగులో సరిగ్గా అనువదించి బోధించాలని తెలిపారు. విద్యార్థులు చదివింది అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎల్.వి.గిరి రాజ్ గౌడ్, తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో గుండె బాబు, ఎంఈఓ శ్రీధర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Also ReadValentine’s Day Crime: ప్రేమికుల రోజున భార్యతో డిన్నర్.. ఆపై గొంతులో కత్తి దింపి.. కిరాతకంగా చంపిన భర్త

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×