E-Paper
Advertisement

‘సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు’.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

‘సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు’.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్
Advertisement

Harish Rao: 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారని బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు మండిపడ్డారు. భూపాలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి కార్మికుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గతంలో ఫిక్స్ డ్ డిపాజిట్లతో కలకల లాడిన సింగరేణి నేడు అప్పులు ఊబిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన రెండున్నరేండ్ల పాలనలో కార్మికుల బతుకులను ఆగం పట్టించిందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దేనిని వదలడం లేదని అన్నిట్లో అవినీతి చేస్తోందని హరీశ్ రావు అన్నారు. సైట్ విజిట్ స్కాం, సోలార్ పవర్ స్కాం, జైపూర్ పవర్ స్కాం, 40 లక్షల బొగ్గు మాయం స్కాం, ఎక్సప్లోజివ్ స్కాం ఇలా అనేక స్కాంలు చేసారని ఆరోపించారు. శ్రీరాంపూర్ ఓసీ టెండర్ ను 7 సార్లు వాయిదా వేశారని హరీశ్ రావు అన్నారు. కమీషన్లు కుదరడం లేదని రేవంత్ బామ్మర్ది వాయిదా వేయించారని ఆరోపించారు. సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం అంతా చేయాలని కార్మికులకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఇలానే ఉంటే మూడేళ్లలో ప్రవేటీకరణ ఖాయమని అన్నారు.

Advertisement

Also Read: తెలంగాణను ‘గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్’గా మారుస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

మరోవైపు కమిషన్ ల కోసమే సోలార్ ప్లాంట్లు పెడుతున్నారని హరీశ్ రావు అన్నారు. రూ.1000 కోట్ల సింగరేణి డబ్బును సోలార్ లో పెడితే అప్పు కాకుంటే ఏమైతది అని ప్రశ్నించారు. సోలార్ పవర్ కొనమని ట్రాన్స్కో స్పష్టంగా చెప్పినా రూ.1000 కోట్లను ప్రభుత్వం వృథా చేసిందని హరీశ్ రావు అన్నారు. ప్రశ్నిస్తే అడుగడుగున కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి పైసలు తీసుకుపోయి 800 మెగా వాట్ల ప్లాంట్ కట్టారంటూ మండిపడ్డారు. కమిషన్ ల కోసమే అడ్డగోలు కార్యక్రమాలకు తెరలేపారని అన్నారు.

Advertisement

Also Read: మ్యూజిక్ డైరెక్టర్‌ను ఇసుకలో పాతిపెట్టిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్!

Related News

నేడు తెలంగాణలో వర్షాలు, ఏపీలో పిడుగుల‌తోపాటు, మరి హైదరాబాద్ మాటేంటి?

బోర్డర్ చెకింగ్ పేరిట వసూళ్లు.. లారీ డ్రైవర్‌ స్టింగ్ ఆపరేషన్, వెలుగులోకి తెచ్చిన ‘బిగ్‌టీవీ’

ఫలించని ట్రీట్‌మెంట్..BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి, కేసీఆర్ సంతాపం

తుర్కపల్లి తండాలో సాంప్రదాయ తీజ్ పండుగ సంబరాలు..!

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఐదుసార్లు దాడి.. ట్రెయినీ ఐపీఎస్ కేసులో సంచలనాలు!

తెలంగాణకు వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

జహీరాబాద్‌లో షాకింగ్ సీన్.. చెప్పుతో కొట్టుకున్న ఎంఐఎం కౌన్సిలర్ భర్త!

మియాపూర్ నాలా ఘటనలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన మానవ హక్కుల కమిషన్!

Big Stories

Advertisement
×